ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వాడివేడిగా సీడబ్ల్యూసీ సమావేశం

ABN, First Publish Date - 2022-03-13T23:01:06+05:30

న్యూఢిల్లీ: దేశ రాజధాని న్యూఢిల్లీలోని ఏఐసీసీ కార్యాలయంలో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ నేతృత్వంలో కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశమైంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ: దేశ రాజధాని న్యూఢిల్లీలోని ఏఐసీసీ కార్యాలయంలో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ నేతృత్వంలో కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశమైంది. ఇటీవలి ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలతో పాటు పార్టీ నాయకత్వం, భవిష్యత్ కార్యాచరణపై చర్చిస్తున్నారు. ఐదు రాష్ట్రాల్లోనూ కాంగ్రెస్ పార్టీకి అతి దారుణమైన ఫలితాలు రావడంతో సమావేశం వాడివేడిగా సాగుతోంది. ముఖ్యంగా పంజాబ్‌లో ఎదురైన ఘోర పరాభవంపై కూడా చర్చిస్తున్నారు. గులాం నబీ ఆజాద్ నివాసంలో నిన్న అసమ్మతి నేతలు సమావేశమై చర్చించిన విషయాలపై కూడా చర్చకు వస్తోంది. ముకుల్ వాస్నిక్‌ను పార్టీ ప్రెసిడెంట్ గా చేయాలని అసమ్మతి నేతల జీ 23 గ్రూప్ డిమాండ్ చేస్తోంది. పార్టీ సీనియర్ నేతలు గులం నబీ ఆజాద్, చిదంబరం, మల్లికార్జున ఖర్గే, అంబికా సోనీ, రాహుల్ గాంధీ, ప్రియాంకా వాద్రా తదితరులు సమావేశానికి హాజరయ్యారు.  




మరోవైపు ఏఐసీసీ కార్యాలయం బయట కాంగ్రెస్ కార్యకర్తలు సోనియా, రాహుల్ రాజీనామాలు చేయొద్దంటూ నినాదాలు చేస్తున్నారు. 

Updated Date - 2022-03-13T23:01:06+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising