Cabinet Expansion: కాంగ్రెస్కు 3 మంత్రి పదవులు
ABN, First Publish Date - 2022-08-14T22:07:37+05:30
బీహార్ మంత్రివర్గ విస్తరణ ఈనెల 16న జరుగనుంది. నితీష్ కుమార్ సారథ్యంలోని మహా గడ్బంధన్..
పాట్నా: బీహార్ మంత్రివర్గ విస్తరణ ఈనెల 16న జరుగనుంది. నితీష్ కుమార్ (Nitish Kumar) సారథ్యంలోని మహా గడ్బంధన్ (Maha gathbandhan) ప్రభుత్వంలో కాంగ్రెస్ పార్టీకి 3 మంత్రి పదవులు దక్కనున్నాయి. తొలుత ఇద్దరు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ప్రమాణ స్వీకారం చేస్తారని ఏఐసీసీ రాష్ట్ర ఇన్చార్జి భక్త చరణ్ దాస్ ఆదివారంనాడు తెలిపారు. 16వ తేదీ తర్వాత మరోసారి జరిగే విస్తరణలో మూడో ఎమ్మెల్యే మంత్రివర్గంలో చేరుతారని చెప్పారు. ప్రభుత్వంలో చేరే ఇద్దరు ఎమ్మెల్యేల పేర్లు ఇంకా ఖరారు చేయాల్సి ఉందని, సోమవారంనాడు ఖరారు చేస్తామని తెలిపారు.
కాగా, నితీష్ సర్కార్లో నాలుగు సీట్లతో పాటు అసెంబ్లీ స్పీకర్ పదవిని కూడా కాంగ్రెస్ ఆశిస్తున్నట్టు ఇంతకుముందు వార్తలు వచ్చాయి. అయితే, స్పీకర్ పదవిని ఆర్జేడీకి కేటాయించగా, కాంగ్రెస్కు మూడు బెర్త్లు ఖరారయ్యాయి. జేడీయూ, ఆర్జేడీ, కాంగ్రెస్, సీపీఐఎంల్ (ఎల్), సీపీఐ, సీపీఎం, హెచ్ఏఎం పార్టీలతో కలిసి మహాఘట్బంధన్ ప్రభుత్వం ఏర్పడింది. 243 మంది సభ్యుల అసెంబ్లీలో 160కి ఎమ్మెల్యేల బలం ఈ కూటమికి ఉంది. గత బుధవారంనాడు నితీష్ కుమార్ ముఖ్యమంత్రిగా, ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్ ఉప ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు.
Updated Date - 2022-08-14T22:07:37+05:30 IST