ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

బీజేపీ ఆస్తులు భారీగా పెరిగాయి : కాంగ్రెస్

ABN, First Publish Date - 2022-01-29T16:45:35+05:30

దేశంలో పేదలు మరింత పేదరికంలోకి జారుకుంటున్నప్పటికీ

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ : దేశంలో పేదలు మరింత పేదరికంలోకి జారుకుంటున్నప్పటికీ, భారతీయ జనతా పార్టీ ఆస్తులు మాత్రం భారీగా పెరిగాయని కాంగ్రెస్ అధికార ప్రతినిధి రణదీప్ సుర్జీవాలా ఆరోపించారు. పేదలు, మధ్య తరగతి ప్రజల పరిస్థితి మరింత దయనీయంగా మారుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. శనివారం ఆయన ఇచ్చిన ట్వీట్‌లో బీజేపీ ఆస్తుల వివరాలను వెల్లడించారు. 


2013-14లో బీజేపీ ఆస్తుల విలువ రూ.780 కోట్లు అని, వీటి విలువ 2019-20కి వచ్చేసరికి రూ.4,847 కోట్లకు చేరిందని తెలిపారు. దేశంలో పేదలు, మధ్య తరగతి ప్రజలు మరింత నిరుపేదలు అవుతున్నారని తెలిపారు. అదే సమయంలో బీజేపీ ఆస్తుల విలువ 550 శాతం పెరిగిందన్నారు. మరోవైపు ‘‘మేమిద్దరం, మాకిద్దరు’’కు ఉన్న ఆస్తులు లక్షల కోట్ల రూపాయల మేరకు పెరిగాయన్నారు. ఇదే నవ భారతం మోదీ నమూనా అని వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. దేశం నిజంగానే మారుతోందన్నారు. 




Updated Date - 2022-01-29T16:45:35+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising