ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కాస్త జ్వరం.. అంతే!

ABN, First Publish Date - 2022-06-21T12:43:02+05:30

తాను క్షేమంగా వున్నానని, రెండు రోజుల్లో ఎప్పటిలానే ప్రభుత్వ, పార్టీ కార్యక్రమాల్లో చేరతానని రాష్ట్ర ముఖ్యమంత్రి, డీఎంకే అధినేత ఎంకే స్టాలిన్‌ ప్రకటించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

- రెండు రోజుల్లో యధాతథంగా విధుల్లోకి

- ఆందోళన వద్దంటూ కార్యకర్తలకు సీఎం లేఖ


అడయార్‌(చెన్నై), జూన్‌ 20: తాను క్షేమంగా వున్నానని, రెండు రోజుల్లో ఎప్పటిలానే ప్రభుత్వ, పార్టీ కార్యక్రమాల్లో చేరతానని రాష్ట్ర ముఖ్యమంత్రి, డీఎంకే అధినేత ఎంకే స్టాలిన్‌ ప్రకటించారు. ఈ మేరకు ఆయన సోమవారం కార్యకర్తలకు లేఖ రాశారు. పని ఒత్తిడి, వాతావరణంలో మార్పుల కారణంగా తాను స్వల్ప అస్వస్థతకు గురయ్యానని, స్వల్పంగా జ్వర లక్షణాలు కనిపించాయన్నారు. వైద్యుల సూచన మేరకు విశ్రాంతి తీసుకుంటున్నట్లు తెలిపారు. తాను అస్వస్థతకు లోనైనట్టు వార్తలు వెలువడగానే పార్టీ కార్యకర్తలు మొదలుకుని, రాజకీయ నేతలు, వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు ఒకింత ఆందోళనకు గురయ్యారని, దానికి కారణం వారందరూ తనపై చూపుతున్న ప్రేమాభిమానాలేనన్నారు. అయితే తన అనారోగ్యంపై ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని తెలిపారు. ఒకట్రెండు రోజుల విశ్రాంతి తర్వాత ఎప్పటిలా ఉత్సాహంతో తిరిగి విధుల్లో పాల్గొంటానని వివరించారు. విశ్రాంతి సమయంలోనూ అత్యవసర పనులను సమీక్షిస్తున్నట్లు సీఎం తెలిపారు. 

Updated Date - 2022-06-21T12:43:02+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising