ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

బడ్జెట్‌ కసరత్తు ప్రారంభించిన CM

ABN, First Publish Date - 2022-02-10T17:20:35+05:30

హిజాబ్‌ వివాదం కొనసాగుతుండగానే ముఖ్యమంత్రి బసవరాజ్‌ బొమ్మై సచివాలయంలో బుధవారం బడ్జెట్‌పై కసరత్తు ప్రారంభించారు. తొలుత ఇంధనశాఖ అధికారులతో సమావేశమయ్యారు. మంత్రి సునిల్‌కుమార్‌

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

                  - వివిధ శాఖల అధికారులతో చర్చలు


బెంగళూరు: హిజాబ్‌ వివాదం కొనసాగుతుండగానే ముఖ్యమంత్రి బసవరాజ్‌ బొమ్మై సచివాలయంలో బుధవారం బడ్జెట్‌పై కసరత్తు ప్రారంభించారు. తొలుత ఇంధనశాఖ అధికారులతో సమావేశమయ్యారు. మంత్రి సునిల్‌కుమార్‌ ఇంధనశాఖ తాజాస్థితిగతులు, గత ఏడాది కేటాయింపులు, ప్రస్తుత ఏడాది అవసరాలను సీఎంకు వివరించారు. అనంతరం రెవెన్యూశాఖ అధికారులతో ముఖ్యమంత్రి చర్చలు జరిపారు. రెవెన్యూశాఖ మంత్రి ఆర్‌ అశోక్‌ హాజరై శాఖ పరిస్థితిని సమగ్రంగా సీఎంకు వివరించా రు. అనంతరం సమాచారశాఖ అధికారులతోనూ సీఎం మంతనాలు జరిపారు. ఈ సందర్భంగా ప్రభుత్వ ముఖ్యకార్యదర్శి పీవీ రవికుమార్‌, అదనపు ముఖ్యకార్యదర్శి కుమార్‌నాయక్‌, ఆర్థికశాఖ అదనపు కార్యదర్శి ఐఎన్‌ఎస్ ప్రసాద్‌, ప్రణాళికాసంఘం ఉపాధ్యక్షుడు బీజే పుట్టస్వామి, అదనపు కార్యదర్శి వందితాశర్మ, సమాచారశాఖ ప్రధాన కార్యదర్శి మంజునాథ ప్రసాద్‌ తదితరులు పాల్గొన్నారు. తొలిరోజు నాలుగుగంటలకుపైగా శాఖల సమీక్ష జరిపిన సీఎం గురువారం కూడా కొనసాగించనున్నారు. ముఖ్యమంత్రి చేనేత, చక్కెర, కార్మిక, రవాణా, షెడ్యూల్డు కులాలు, తరగతులు, సాంఘిక సంక్షేమం, బీసీ సంక్షేమం, భారీ పరిశ్రమలు, చిన్నపరిశ్రమల శాఖ అధికారులతోనూ సంబంధిత శాఖల మంత్రులతోనూ చర్చలు జరపనున్నారు.  

Updated Date - 2022-02-10T17:20:35+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising