ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Lalu Prasad కు తృటిలో తప్పిన ప్రాణాపాయం

ABN, First Publish Date - 2022-06-07T23:29:25+05:30

ఆర్జేడీ చీఫ్ లాలూ ప్రసాద్ యాదవ్ మంగళవారంనాడు తృటిలో ప్రాణాపాయం నుంచి..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

రాంచీ: ఆర్జేడీ చీఫ్ లాలూ ప్రసాద్ యాదవ్ (Lalu Prasad Yadav) మంగళవారంనాడు తృటిలో ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నారు. జార్ఖాండ్‌లోని పలము జిల్లా సర్క్యూట్ హౌస్‌లో లాలూ బస చేసిన గదిలో మంటలు చెలరేగాయి. ఉదయం 8 గంటల ప్రాంతంలో ఆయన బ్రేక్‌ఫాస్ట్ తీసుకుంటుండగా గోడకు అమర్చిన ఫ్యానులోంచి మంటలు వచ్చాయి. వెంటనే ఆయన సన్నిహితులు అప్రమత్తమై మంటలను ఆర్పేశారు.


షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు వచ్చాయని, వెంటనే విద్యుత్ సరఫరాను నిలిపివేశామని డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ శశిరంజన్ తెలిపారు. ఈ ఘటనలో ఎవరూ గాయపడలేదని, ఎలాంటి నష్టం జరగలేదని చెప్పారు. విద్యుత్ సరఫరా లోపాన్ని సరిచేసి, మంటల్లో చిక్కుకున్న ఫ్యాన్‌ను తొలగించామని అన్నారు. లాలూ ప్రసాద్ యాదవ్ 13 ఏళ్ల క్రితం ఎన్నికల సందర్భంగా ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించారనే కేసుకు సంబంధించి బుధవారంనాడు ప్రత్యేక కోర్టు ముందు హాజరుకావాల్సి ఉంది. ఇందుకోసం ఆయన పలము జిల్లా ప్రధాన కార్యాలయమైన మేదినినగర్‌కు సోమవారంనాడు వచ్చారు.

Updated Date - 2022-06-07T23:29:25+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising