Class rooms: దేశ వ్యాప్తంగా 7,890 తరగతుల నిర్మాణం
ABN, First Publish Date - 2022-11-23T10:25:14+05:30
‘విద్య ద్వారా విముక్తి’ పథకంలో భాగంగా తాము దేశవ్యాప్తంగా 7,890 తరగతి గదులు(Class rooms) నిర్మించినట్లు ‘రౌండ్ టేబుల్ ఇండియా’ సంస్థ అధినేత సంతోష్,
చెన్నై, నవంబరు 22 (ఆంధ్రజ్యోతి): ‘విద్య ద్వారా విముక్తి’ పథకంలో భాగంగా తాము దేశవ్యాప్తంగా 7,890 తరగతి గదులు(Class rooms) నిర్మించినట్లు ‘రౌండ్ టేబుల్ ఇండియా’ సంస్థ అధినేత సంతోష్, విజయరాఘవేంద్ర(Santosh, Vijayaraghavendra) తదితరులు పేర్కొన్నారు. ఇటీవల నగరంలో జరిగిన రౌండ్ టేబుల్ ఇండియా వారోత్సవాల్లో భాగంగా వారు విలేఖరులతో మాట్లాడుతూ.. ఈ ఏడాది కూడా సమానత్వాన్ని పెంపొందించేందుకు వివిధ సంక్షేమ పథకాలు ట్రాన్స్జెండర్లు, దివ్యాంగులకు కల్పించామన్నారు. అలాగే చిన్నారులకు ఉచితంగా హృద్రోగ శస్త్రచికిత్స చేయించామన్నారు. అదే విధంగా 200 మంది దివ్యాంగులకు మూడు చక్రాల కుర్చీలను పంపిణీ చేశామని వివరించారు. మున్ముందు మరిన్ని కార్యక్రమాలు చేపట్టనున్నట్లు తెలిపారు.
విలేఖరుల సమావేశంలో నిర్వాహకులు
Updated Date - 2022-11-23T10:25:16+05:30 IST