ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కరాచీ పేలుడుతో పాకిస్థాన్‌కు చైనా హెచ్చరిక

ABN, First Publish Date - 2022-04-27T16:48:14+05:30

కరాచీ ఆత్మాహుతి బాంబర్ దాడి ఘటనలో ముగ్గురు చైనీయుల మృతి నేపథ్యంలో చైనా పాకిస్థాన్ దేశానికి తాజాగా హెచ్చరిక జారీ చేసింది....

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

చైనీయుల భద్రతకు చర్యలు తీసుకోండి

బీజింగ్ (చైనా) : కరాచీ ఆత్మాహుతి బాంబర్ దాడి ఘటనలో ముగ్గురు చైనీయుల మృతి నేపథ్యంలో చైనా పాకిస్థాన్ దేశానికి తాజాగా హెచ్చరిక జారీ చేసింది.పాక్ దేశంలోని చైనా ప్రాజెక్టుల్లో పనిచేస్తున్న చైనీయుల భద్రతకు చర్యలు తీసుకోవాలని బీజింగ్ ఇస్లామాబాద్ ను డిమాండ్ చేసింది.మంగళవారం యూనివర్శిటీ ఆఫ్ కరాచీ ఆవరణలో జరిగిన కారులో పేలుడు సంభవించిన ఘటనలో మరణించిన నలుగురిలో ముగ్గురు చైనా జాతీయులు ఉన్నారు. కరాచీ యూనివర్శిటీలోని చైనీస్ భాషా బోధనా కేంద్రం కన్ఫ్యూషియస్ ఇనిస్టిట్యూట్ సమీపంలో వ్యాన్‌లో ఈ పేలుడు సంభవించింది.చైనీస్ స్టేట్ మీడియా ఈ పేలుడును ఖండించింది. చైనా ప్రాజెక్టు సిబ్బంది భద్రత కోసం పాకిస్తాన్ మరిన్ని ప్రయత్నాలు చేయాలని డిమాండ్ చేసింది.తమ చైనా జాతీయులను లక్ష్యంగా చేసుకుని దాడులకు పాల్పడే శక్తులపై అత్యంత కఠినంగా ఉంటామని చైనా హెచ్చరించింది.


Updated Date - 2022-04-27T16:48:14+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising