ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

నగరంలో Covid పడగ

ABN, First Publish Date - 2022-01-17T13:41:04+05:30

రాజధాని నగరం చెన్నైలో కరోనా విస్త్రతమవుతోంది. మొత్తం 39,537 వీధులకు గాను 2454 వీదుల్లో కరోనా బాధితులున్నారు. చెన్నైలో బాధితుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. ఇక్కడ 50 వేల మందికి పైగా చికి

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

                     - 2454 వీధుల్లో వైరస్‌ విజృంభణ


చెన్నై: రాజధాని నగరం చెన్నైలో కరోనా విస్త్రతమవుతోంది. మొత్తం 39,537 వీధులకు గాను 2454 వీదుల్లో కరోనా బాధితులున్నారు. చెన్నైలో బాధితుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. ఇక్కడ 50 వేల మందికి పైగా చికిత్స పొందుతున్నారు. వీటిల్లో 280 వీధుల్లో 10 నుంచి 25 మందికి వైరస్‌ సోకింది. 593 వీధుల్లో 6 నుంచి 10 మంది, 1591 వీధుల్లో 3 నుంచి ఐదుగురి వరకు కరోనా బాధితులున్నారు. కానీ చెన్నైలోని ఒక్క వీధికూడా 25 మందికి పైగా కరోనా ప్రభావితం కాలేదని కార్పొరేషన్‌ ఉన్నతాధికారులు వెల్లడించారు. చెన్నైలో తొమ్మిది కార్పొరేషన్‌ జోన్లలో కరోనా బాధితుల సంఖ్య మూడువేలు దాటింది. అన్నానగర్‌, తేనాంపేట జోన్లలో ఆరువేలకు పైగా కరోనా కేసులు నమోదయ్యాయి. అడయార్‌, కోడంబాక్కం జోన్లలో సంఖ్య ఐదువేలకుపైగానే వుంది. నగరంలో ఆదివారం పాజిటివ్‌ కేసుల సంఖ్య 8987కి పెరిగింది. నగరంలోని 15 జోన్లలో తేనాంపేట, అన్నానగర్‌ జోన్లలో కరోనాతో చికిత్స పొందుతున్నవారి సంఖ్య ఆరువేలు దాటింది. తేనాంపేట జోన్‌లో 6783 మంది, అన్నానగర్‌ జోన్‌లో 6439 మంది కొవిడ్‌ బాధితులు వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. ఇక తొమ్మిది జోన్లలో కరోనా కేసుల సంఖ్య మూడు వేలు దాటింది. అడయార్‌, కోడంబాక్కం జోన్లలో ఐదువేలకు పైగా కరోనా కేసులు నమోదయ్యాయి.

Updated Date - 2022-01-17T13:41:04+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising