Measles Cases: పిల్లల్లో మీజిల్స్ కేసులు...3 రాష్ట్రాలకు ఉన్నతస్థాయి కేంద్ర బృందాలు
ABN, First Publish Date - 2022-11-24T05:40:40+05:30
దేశంలోని మూడు రాష్ట్రాల్లో మీజిల్స్ కేసుల సంఖ్య పెరుగుతోంది. జార్ఖండ్, గుజరాత్, కేరళ రాష్ట్రాల్లోని పిల్లల్లో మీజిల్స్ కేసుల సంఖ్య పెరుగుతుండటంతో..
న్యూఢిల్లీ: దేశంలోని మూడు రాష్ట్రాల్లో మీజిల్స్ కేసుల సంఖ్య పెరుగుతోంది. జార్ఖండ్, గుజరాత్, కేరళ రాష్ట్రాల్లోని పిల్లల్లో మీజిల్స్ కేసుల సంఖ్య పెరుగుతుండటంతో కేంద్ర ఆరోగ్య, కుటుంబసంక్షేమ శాఖ అప్రమత్తమైంది.కేంద్ర ఆరోగ్యశాఖ నిపుణుల బృందాలు(High Level Teams) రాంచీ (జార్ఖండ్), అహ్మదాబాద్ (గుజరాత్), మలప్పురం (కేరళ)లకు పంపాలని కేంద్రం తాజాగా ఆదేశించింది. పిల్లల్లో (Childrens)మీజిల్స్ కేసుల(Measles Cases) నియంత్రణకు కార్యాచరణను రూపొందించి ఆయా రాష్ట్రాల్లో ప్రజారోగ్య చర్యలు ప్రారంభించేందుకు కేంద్ర అధికార బృందాలు రాష్ట్రాలకు సహకరించనున్నాయి.
ముంబయి నగరంలో తట్టు వ్యాధితో ఓ చిన్నారి మృతి చెందింది. ముంబయిలోని కళావతి సరన్ చిల్డ్రన్స్ హాస్పిటల్,ఆరోగ్య, కుటుంబ సంక్షేమ ప్రాంతీయ కార్యాలయం వైద్యనిపుణులు,పాండిచ్చేరిలోని జవహర్లాల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పోస్ట్ గ్రాడ్యుయేట్ మెడికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్,ఢిల్లీలోని లేడీ హార్డింగ్ మెడికల్ కాలేజ్ వైద్యులు రాష్ట్రాలకు వెళ్లి మీజిల్స్ పై అధ్యయనం చేయనున్నారు. దేశంలోని పిల్లల్లో మీజిల్స్ కేసులను నియంత్రించేందుకు కేంద్ర ఆరోగ్యశాఖ చర్యలను ముమ్మరం చేసింది.
Updated Date - 2022-11-24T06:51:44+05:30 IST