EVMలు మనకు గర్వకారణం : సీఈసీ సుశీల్ చంద్ర
ABN, First Publish Date - 2022-01-08T22:53:54+05:30
ఉత్తర ప్రదేశ్, ఉత్తరాఖండ్, పంజాబ్, గోవా, మణిపూర్ శాసన సభ ఎన్నికల
న్యూఢిల్లీ : ఉత్తర ప్రదేశ్, ఉత్తరాఖండ్, పంజాబ్, గోవా, మణిపూర్ శాసన సభ ఎన్నికల షెడ్యూలును చీఫ్ ఎలక్షన్ కమిషనర్ సుశీల్ చంద్ర శనివారం ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్లో నిర్వహించిన మీడియా సమావేశంలో ప్రకటించారు. ఈ సందర్భంగా ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలు (ఈవీఎం)లపై వస్తున్న ఆరోపణలపై స్పందించారు. ఈవీఎంలపై ఇప్పుడు సమస్య ఏదీ లేదన్నారు. ఇవి 2004 నుంచి ఉన్నాయని, ఇప్పటి వరకు 350 కోట్ల మంది ఓటర్లు దీనిని ఉపయోగించారని చెప్పారు. ఈవీఎలను మన దేశం అభివృద్ధిపరచిందని, ఇవి మనకు గర్వకారణమని చెప్పారు. ఇవి కచ్చితమైన ఫలితాలను ఇస్తున్నాయని, ఇది కచ్చితమైన వ్యవస్థ అని, ఓట్ల లెక్కింపు వేగంగా జరుగుతుందని తెలిపారు.
Updated Date - 2022-01-08T22:53:54+05:30 IST