ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Rajastan SBI : రూ.11 కోట్ల విలువైన నాణేలు అదృశ్యం... 25 చోట్ల సీబీఐ సోదాలు...

ABN, First Publish Date - 2022-08-19T00:30:09+05:30

రాజస్థాన్ (Rajasthan)లోని భారతీయ స్టేట్ బ్యాంక్ (SBI) కరౌలీ శాఖ నుంచి రూ

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ : రాజస్థాన్ (Rajasthan)లోని భారతీయ స్టేట్ బ్యాంక్ (SBI) కరౌలీ శాఖ నుంచి రూ.11 కోట్ల విలువైన నాణేలు అదృశ్యమయ్యాయి. దీనిపై కేసు నమోదు చేసి, దర్యాప్తు చేయాలని ఆ రాష్ట్ర హైకోర్టు ఏప్రిల్ 13న కేంద్ర దర్యాప్తు సంస్థ (CBI)ని ఆదేశించింది. దీంతో సీబీఐ రంగంలోకి దిగి గురువారం 25 చోట్ల సోదాలు నిర్వహించింది. 


ఎస్‌బీఐ కరౌలీ శాఖ 2021 ఆగస్టులో నగదు నిల్వల తనిఖీని నిర్వహించాలని నిర్ణయించింది. ఓ ప్రైవేటు సంస్థ చేత తనిఖీలు చేయించింది. రూ.11 కోట్ల విలువైన నాణేలు కనిపించడం లేదని ఈ తనిఖీల్లో వెల్లడైంది. 


సీబీఐ అధికారులు తెలిపిన సమాచారం ప్రకారం, 15 మంది మాజీ బ్యాంకు అధికారులు, ఇతరులకు సంబంధించిన ఇళ్లు, కార్యాలయాల్లో సోదాలు నిర్వహించారు. ఢిల్లీ, జైపూర్, దౌసా, కరౌలీ, సవాయ్ మాధోపూర్, ఆల్వార్, ఉదయ్‌పూర్, భిల్వారాలలోని 25 చోట్ల ఈ సోదాలు జరిగాయి. 



Updated Date - 2022-08-19T00:30:09+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising