లాలూపై సీబీఐ చార్జిషీటు
ABN, First Publish Date - 2022-10-08T09:40:06+05:30
‘భూములిస్తే ఉద్యోగాలు’ కుంభకోణం కేసులో కేంద్ర మాజీ రైల్వే మంత్రి లాలూ ప్రసాద్ యాదవ్, ఆయన భార్య రబ్డీ దేవి, కూతురు మీసా భారతితో పాటు మరో 13 మందిపై సీబీఐ అభియోగపత్రం దాఖలు చేసింది.
న్యూఢిల్లీ, అక్టోబరు 7: ‘భూములిస్తే ఉద్యోగాలు’ కుంభకోణం కేసులో కేంద్ర మాజీ రైల్వే మంత్రి లాలూ ప్రసాద్ యాదవ్, ఆయన భార్య రబ్డీ దేవి, కూతురు మీసా భారతితో పాటు మరో 13 మందిపై సీబీఐ అభియోగపత్రం దాఖలు చేసింది. లాలూ రైల్వే మంత్రిగా ఉన్న సమయంలో పట్నాలో స్థలాలను తమ కుటుంబ సభ్యుల పేర రాయించుకొని రైల్వేలో గ్రూప్ డీ ఉద్యోగాలు ఇచ్చారని సీబీఐ ఆరోపించింది. ఇలా 1.05 లక్షల చదరపు అడుగుల స్థలాన్ని రబ్డీ దేవి, మీసా భారతి తదితరుల పేరిట రిజిస్ట్రేషన్ చేసుకున్నారని, రిజిస్ట్రేషన్ జరిగిన కొన్ని రోజుల్లోనే వారి కుటుంబసభ్యులకు పోస్టులు ఇచ్చారని తెలిపింది. చార్జిషీటును కోర్టుకు సమర్పించింది.
Updated Date - 2022-10-08T09:40:06+05:30 IST