ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Rebel MLAలకు ఊరట.. MVA పిటిషన్‌‌పై అత్యవసర విచారణను తిరస్కరించిన SC

ABN, First Publish Date - 2022-07-01T18:23:01+05:30

మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా శివసేన రెబెల్ ఎమ్మెల్యేల కూటమి నేత ఏక్‌నాథ్ షిండే గురువారం ప్రమాణ స్వీకారం చేశారు. కాగా, జూలై నాల్గవ తేదీన ముఖ్యమంత్రి విశ్వాస పరీక్షకు వెళ్లనున్నారు. ఈ నేపథ్యంలో రెబెల్ ఎమ్మెల్యేలను అసెంబ్లీ కార్యకలాపాల్లో..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ముంబై: తిరుగుబాటు ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని కోరుతూ మహా వికాస్ అగాఢీ దాఖలు చేసిన పిటిషన్‌పై అత్యవసర విచారణను సుప్రీంకోర్టు తిరస్కరించింది. అంతే కాకుండా ఈ పిటిషన్‌ను జూలై 11న పరిశీలిస్తామని సుప్రీం శుక్రవారం తెలిపింది. 16 మంది ఎమ్మెల్యేలపై రాష్ట్ర అసెంబ్లీలలో విచారణ జరుతుగున్న నేపథ్యంలో.. ఈ విషయంలో డిప్యూటీ స్పీకర్ నిర్ణయం తీసుకునే వరకు వారు అసెంబ్లీ కార్యకలాపాల్లో పాల్గొనకుండా సస్సెండ్ చేయాలని కోరుతూ సుప్రీంలో ఎంవీఏ కూటమి సుప్రీంలో పిటిషన్ దాఖలు చేసింది. ఈ విషయమై అత్యవసర విచారణ చేపట్టాలని పిటిషన్‌లో ఎంవీఏ విజ్ణప్తి చేసింది. అనర్హత వేటు వేయాలని ఎంవీఏ పేర్కొన్న ఎమ్మెల్యేల్లో ఏక్‌నాథ్ షిండే కూడా ఉన్నారు.


మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా శివసేన రెబెల్ ఎమ్మెల్యేల కూటమి నేత ఏక్‌నాథ్ షిండే గురువారం ప్రమాణ స్వీకారం చేశారు. కాగా, జూలై నాల్గవ తేదీన ముఖ్యమంత్రి విశ్వాస పరీక్షకు వెళ్లనున్నారు. ఈ నేపథ్యంలో రెబెల్ ఎమ్మెల్యేలను అసెంబ్లీ కార్యకలాపాల్లో పాల్గొనకుండా సస్పెండ్ చేయాలంటూ ఎంవీఏ అత్యున్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించడం గమనార్హం. జూలై 3వ తేదీని మహారాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. 3, 4 తేదీల్లో రెండు రోజుల పాటు సమావేశాలు కొనసాగుతాయి. నిజానికి ఈ సమావేశాలు 2,3 తేదీల్లో జరగాల్సి ఉండగా.. కొన్ని అనివార్య కారణాల వల్ల ఒక రోజు ఆలస్యంగా ప్రారంభంకానున్నాయి.

Updated Date - 2022-07-01T18:23:01+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising