ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టు బాస్‌పై అవినీతి ఆరోపణలు... సర్వీస్ నుంచి తొలగించిన రైల్వేలు...

ABN, First Publish Date - 2022-07-08T20:10:16+05:30

ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టు ఇన్‌ఛార్జి, NHSRCL

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ : ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టు ఇన్‌ఛార్జి, NHSRCL మేనేజింగ్ డైరెక్టర్ సతీష్ అగ్నిహోత్రిని రైల్వే శాఖ సర్వీస్ నుంచి తొలగించింది. ఆయన అధికార, నిధుల దుర్వినియోగానికి పాల్పడినందుకు ఈ చర్య తీసుకుంది. బుల్లెట్ ట్రైన్ ఇన్‌ఛార్జి బాధ్యతలను రాజేంద్ర ప్రసాద్‌కు అప్పగించింది. ఆయన ఈ పదవిలో మూడు నెలలపాటు కొనసాగుతారు. 


సీనియర్ రైల్వే అధికారులు తెలిపిన వివరాల ప్రకారం, నేషనల్ హై స్పీడ్ రైల్ కార్పొరేషన్ లిమిటెడ్ (NHSRCL) మేనేజింగ్ డైరెక్టర్ సతీష్ అగ్నిహోత్రి రైల్ వికాస్ నిగం లిమిటెడ్ సీఎండీగా తొమ్మిదేళ్లపాటు పని చేశారు. ఆ సమయంలో ఓ ప్రైవేటు కంపెనీతో కుదుర్చుకున్న ఒప్పందంలో ఒకరికొకరు ఇచ్చి, పుచ్చుకునే లావాదేవీలు జరిగాయేమో దర్యాప్తు చేయాలని సీబీఐ (కేంద్ర దర్యాప్తు సంస్థ)ను లోక్‌పాల్ జూన్ 2న ఆదేశించింది. ఈ ఏడాది డిసెంబరు 12లోగా నివేదికను సమర్పించాలని తెలిపింది. 


అనధికారికంగా ఓ ప్రైవేట్ కంపెనీకి నిధులను మళ్లించారని అగ్నిహోత్రిపై ఆరోపణలు వచ్చాయి.అధికార, నిధుల దుర్వినియోగానికి పాల్పడ్డారనే ఆరోపణలపై ఆయనను  సర్వీస్ నుంచి రైల్వే శాఖ తొలగించి, బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టు ఇన్‌ఛార్జి బాధ్యతలను మూడు నెలలపాటు NHSRCL డైరెక్టర్ (ప్రాజెక్ట్స్) రాజేంద్ర ప్రసాద్‌కు అప్పగించింది. 


హైస్పీడ్ రైల్ ప్రాజెక్టుల అమలు కోసం భారత ప్రభుత్వం, సంబంధిత రాష్ట్ర ప్రభుత్వాలతో కలిసి ఏర్పాటు చేసిన జాయింట్ వెంచర్ NHSRCL. అగ్నిహోత్రి పదవీ విరమణ తర్వాత ఓ ఏడాదిలోగానే ఓ ప్రైవేటు కంపెనీలో ఉద్యోగ బాధ్యతలను చేపట్టారని రైల్వే అధికారులు తెలిపారు. రిటైర్డ్ అధికారులు తాము పదవీ విరమణ చేసిన తర్వాత ఓ ఏడాది నిండక ముందే ఏదైనా కంపెనీలో, వాణిజ్య సంస్థలో ఉద్యోగం పొందకూడదని, ఒకవేళ ఓ ఏడాదిలోగా ఉద్యోగాన్ని స్వీకరించాలంటే, కేంద్ర ప్రభుత్వ అనుమతి తప్పనిసరి అని ప్రభుత్వ నిబంధనలు చెప్తున్నాయన్నారు. అగ్నిహోత్రి ఈ నిబంధనలను ఉల్లంఘించారన్నారు. 


ఇదిలావుండగా, ఈ ఆరోపణలను అగ్నిహోత్రి తోసిపుచ్చారు. తాను ఏ కంపెనీకైనా అనుకూలంగా పని చేయలేదన్నారు. ఇటువంటి పనులను చేసే ఏ కంపెనీలోనూ తన కుమారుడు పని చేయడం లేదన్నారు. 


Updated Date - 2022-07-08T20:10:16+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising