Punjab సీఎంతోపాటు రైల్వేస్టేషన్లపై బాంబులతో దాడి చేస్తాం...
ABN, First Publish Date - 2022-04-28T12:37:26+05:30
పంజాబ్ రాష్ట్ర ముఖ్యమంత్రి భగవంత్ సింగ్ మాన్తో పాటు సుల్తాన్ పూర్ లోధి రైల్వేస్టేషనుపై బాంబులతో దాడి చేస్తామని ఆగంతకుడి నుంచి తాజాగా బెదిరింపు లేఖ...
ఆగంతకుడి బెదిరింపు లేఖ...పంజాబ్ రాష్ట్రంలో హైఅలర్ట్
న్యూఢిల్లీ: పంజాబ్ రాష్ట్ర ముఖ్యమంత్రి భగవంత్ సింగ్ మాన్తో పాటు సుల్తాన్ పూర్ లోధి రైల్వేస్టేషనుపై బాంబులతో దాడి చేస్తామని ఆగంతకుడి నుంచి తాజాగా బెదిరింపు లేఖ వచ్చింది. పంజాబ్ రాష్ట్రంలోని కపుర్తలాలోని సుల్తాన్పూర్ లోధి రైల్వే స్టేషన్లో బాంబు బెదిరింపు లేఖ దొరికింది. ఈ ఘటనపై పంజాబ్ పోలీసులు విచారణ కూడా ప్రారంభించారు.దర్యాప్తులో భాగంగా లేఖ వదిలిన ఆగంతకుడిని గుర్తించేందుకు సీసీటీవీ ఫుటేజీలను పరిశీలిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.సుల్తాన్పూర్ లోధి, ఫిరోజ్పూర్, జలంధర్ వంటి ప్రధాన రైల్వే స్టేషన్లను మే 21వతేదీ నాటికి పేల్చివేసి ప్రతీకారం తీర్చుకుంటామని ఆగంతకుడు లేఖలో పేర్కొన్నట్లు స్టేషన్ మాస్టర్ తెలిపారు.
ముఖ్యమంత్రి భగవంత్ మాన్, మరికొంత మంది వ్యక్తులపై కూడా దాడి చేస్తామని లేఖలో పేర్కొన్నారని సుల్తాన్పూర్ లోధి రైల్వే స్టేషన్ స్టేషన్ మాస్టర్ చెప్పారు.ఈ కేసుపై తదుపరి విచారణ కొనసాగుతోంది. బెదిరింపు లేఖతో పంజాబ్ రాష్ట్రం అంతటా భద్రతను పెంచారు. రాష్ట్ర పోలీసులు హై అలర్ట్ ప్రకటించారు.
Updated Date - 2022-04-28T12:37:26+05:30 IST