కరోనా బాధితుల్లో ఆర్నెల్ల దాకా బ్లడ్ క్లాట్స్ ముప్పు
ABN, First Publish Date - 2022-04-08T09:00:29+05:30
కరోనా వైరస్ బారిన పడి కోలుకున్నా.. వారి రక్తంలో గడ్డలు ఏర్పడే ముప్పు ఆరు నెలల దాకా ఉంటున్నట్టు స్వీడన్ పరిశోధకులు గుర్తించారు.
2 నెలలపాటు రక్తస్రావ ప్రమాదం
స్వీడన్ పరిశోధకుల అధ్యయనంలో వెల్లడి
లండన్, ఏప్రిల్ 7: కరోనా వైరస్ బారిన పడి కోలుకున్నా.. వారి రక్తంలో గడ్డలు ఏర్పడే ముప్పు ఆరు నెలల దాకా ఉంటున్నట్టు స్వీడన్ పరిశోధకులు గుర్తించారు. ముఖ్యంగా కాళ్లలోని రక్తనాళాల్లో గడ్డలు ఏర్పడే (డీప్ వెయిన్ త్రాంబోసిస్) ముప్పు మూడు నెలలపాటు, ఊపిరితిత్తుల్లో గడ్డలు ఏర్పడే ముప్పు ఆరునెలలపాటు, అలాగే రక్తస్రావం అయ్యే ప్రమాదం రెండు నెలలపాటు ఉంటున్నట్టు వారి పరిశోధనలో తేలింది.
Updated Date - 2022-04-08T09:00:29+05:30 IST