ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

బీజేపీ గుర్తుపై బుల్డోజర్లు నడపాలి: అఖిలేష్

ABN, First Publish Date - 2022-04-21T02:06:26+05:30

భారతీయ జనతా పార్టీ గుర్తుపై బుల్డోజర్లు నడపాలని, బీజేపీ అక్రమ అధికారానికి..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ: భారతీయ జనతా పార్టీ గుర్తుపై బుల్డోజర్లు నడపాలని, బీజేపీ అక్రమ అధికారానికి సింబల్ 'బుల్డోజర్' అని సమాజ్‌వాదీ పార్టీ చీఫ్ అఖిలేష్ యాదవ్ అన్నారు. ఢిల్లీలో అల్లర్లు జరిగిన జహంగీర్‌పురిలో కూల్చివేతల డ్రైవ్‌పై ఆయన ట్విట్టర్‌లో ఘాటుగా స్పందించారు. ''చట్టవిరుద్ధమైన అధికారానికి గుర్తుగా బుల్డోజర్‌ను బీజేపీ మలుచుకుంది. ముస్లింలు, ఇతర మైనారిటీలు, వెనుకబడిన, దళిత వర్గాలే వారి టార్గెట్. వాళ్ల హిస్టీరియాకు హిందువులు కూడా ఇప్పుడులు బాధితులుగా మారుతున్నారు. నిజానికి రాజ్యాంగంపైనే బీజేపీ బుల్డోజర్ నడుపుతోంది. ఆ పార్టీ సింబల్‌గా బుల్డోజర్‌ను మార్చుకోవాలి'' అని అఖిలేష్ ట్వీట్ చేశారు.


హిందువులు-ముస్లింలు ఎప్పుడూ కలిసికట్టుగా జీవనం సాగించాలని కోరుకుంటున్నారని, దీనిని బీజేపీ, ఆ పార్టీ కంట్రోల్‌లో ఉన్న మీడియా సహించలేకపోతోందని అన్నారు. ఢిల్లీలో ఎంసీడీ ఎన్నికలు జరగాల్సి ఉన్నందున ఇలాంటి వాతావరణాన్ని బీజేపీ సృష్టిస్తోందని, ఈ మొత్తం వ్యవహారంలో హిందూ, ముస్లింలు నలిగిపోతున్నారని మరో ట్వీట్‌లో అఖిలేష్  పేర్కొన్నారు.

Updated Date - 2022-04-21T02:06:26+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising