ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

PM Modi Birthday: ఈసారి మోదీ పుట్టినరోజు వేడుకలు ఏ రేంజ్‌లో జరపబోతున్నారంటే?

ABN, First Publish Date - 2022-09-02T02:14:08+05:30

న్యూఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పుట్టినరోజు వేడుకలను ఈసారి 15 రోజుల పాటు జరుపుకోవాలని భారతీయ జనతాపార్టీ నిర్ణయించింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పుట్టినరోజు వేడుకలను ఈసారి 15 రోజుల పాటు జరుపుకోవాలని భారతీయ జనతాపార్టీ నిర్ణయించింది. సెప్టెంబర్ 17 నుంచి అక్టోబర్ 2 గాంధీ జయంతి వరకూ సేవా పక్వాడా పేరుతో ఈ వేడుకలు నిర్వహిస్తారు. దీనికి సంబంధించి పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి అరుణ్ సింగ్ పార్టీ కార్యకర్తలకు లేఖలు రాశారు. రక్తదానం, ఉచిత వైద్య శిబిరాలు, వికలాంగులకు ఉచితంగా పరికరాలు అందజేయడం, మొక్కలు నాటడం వంటి సేవా కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు. మోదీ ఎట్ 20 సప్నే హుయే సాకార్ పేరిట ఓ పుస్తకాన్ని కూడా విడుదల చేస్తారు. జిల్లా స్థాయిల్లో ఎగ్జిబిషన్లు కూడా నిర్వహిస్తారు. కోవిడ్ 19 బూస్టర్ డోసులు తీసుకోవాలని కూడా బీజేపీ కార్యకర్తలు ప్రచారం చేస్తారు.


కార్యకర్తలు తమ సేవా కార్యక్రమాల ఫొటోలు తీసి నమో యాప్‌లో అప్‌లోడ్ చేయాలని బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా సూచించారు. సెప్టెంబర్ 25న భారతీయ జన్‌సంఘ్ వ్యవస్థాపకుడు దీన్‌దయాల్ ఉపాధ్యాయ జయంతి వేడుకలను కూడా ఘనంగా నిర్వహించాలని నద్దా పిలుపునిచ్చారు. మహాత్మాగాంధీ జయంతి అయిన అక్టోబర్ రెండున ఖాదీ ఉత్పత్తులను కొనుగోలు చేయడమే కాక ఖాదీకి ప్రచారం కల్పించాలన్నారు. దేశవ్యాప్తంగా సేవా కార్యక్రమాల పర్యవేక్షణ కోసం బీజేపీ జాతీయ స్థాయిలో ఓ సమన్వయ కమిటీ ఏర్పాటు చేసింది. బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి అరుణ్ సింగ్, ఉపాధ్యక్షుడు రఘుబర్‌దాస్, జాతీయ యువమోర్చా అధ్యక్షుడు తేజస్వీ సూర్య, తదితరులు ఈ కమిటీలో ఉన్నారు. 

Updated Date - 2022-09-02T02:14:08+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising