BJP: బీజేపీ నేతల పర్యటనలు వాయిదా
ABN, First Publish Date - 2022-09-07T17:33:17+05:30
రాజధాని బెంగళూరు నగరంతో పాటు రాష్ట్రంలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు పడుతున్న నేపథ్యంలో బుధవారం నుంచి ప్రారంభం కానున్న
బెంగళూరు, సెప్టెంబరు 6 (ఆంధ్రజ్యోతి): రాజధాని బెంగళూరు నగరంతో పాటు రాష్ట్రంలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు పడుతున్న నేపథ్యంలో బుధవారం నుంచి ప్రారంభం కానున్న బీజేపీ(BJP) నేతల రాష్ట్ర పర్యటనలు వాయిదా పడ్డాయి. పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్సీ ఎన్ రవికుమార్ నగరంలో మంగళవారం మీడియా సమావేశంలో ఈ విషయం ప్రకటించారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు నళిన్ కుమార్ కటీల్(BJP state president Nalin Kumar Kateel) నాయకత్వంలో ఒక బృందం, ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై, పార్టీ పార్లమెంటరీ బోర్డు సభ్యుడు బీఎస్ యడియూరప్ప(BS Yeddyurappa) నాయకత్వంలో మరో బృందం మొత్తం 104 శాసనసభ నియోజకవర్గాల్లో పర్యటిస్తుందన్నారు. రాజకీయ లబ్ధికోసం ప్రభుత్వంపై విమర్శలు చేయకుండా సహాయ కార్యక్రమాల్లో పాలుపంచుకోవాలని ఆయన ప్రతిపక్షాలకు విజ్ఞప్తి చేశారు.
Updated Date - 2022-09-07T17:33:17+05:30 IST