ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

లాలూపై వేధింపులకు కారణం చెప్పిన ప్రియాంక

ABN, First Publish Date - 2022-02-18T21:30:57+05:30

బీజేపీకి తలవంచని ఎవరైనా సరే వేధింపులకు గురికావాల్సిందేనని, అదే బీజేపీ రాజకీయాల్లో ప్రత్యేకత అని..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ: బీజేపీకి తలవంచని ఎవరైనా సరే వేధింపులకు గురికావాల్సిందేనని, అదే  బీజేపీ రాజకీయాల్లో ప్రత్యేకత అని కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీ వాద్రా అన్నారు. పశుగ్రాసం కుంభకోణంలో సీబీఐ ప్రత్యేక కోర్టు ఇటీవల దోషిగా నిర్ధారించిన ఆర్జేడీ నేత లాలూ ప్రసాద్  యాదవ్‌కు న్యాయం జరుగుతుందనే ఆశాభావాన్ని ఆమె వ్యక్తం చేశారు.


''బీజేపీ బ్రాండ్ ఆఫ్ పాలిటిక్స్‌లో కీలకాంశం ఒకటుంది. ఎవరైతే తలవంచరో (పార్టీ ముందు) వాళ్లని వేధిస్తుంటారు. రాజకీయాల్లో రాజీలేని ధోరణి కారణంగానే లాలూ ప్రసాద్ యాదవ్‌ లక్ష్యంగా దాడి జరిగింది. ఆయనకు న్యాయం జరుగుతుందనే ఆశిస్తున్నాను'' అని ఆ ట్వీట్‌లో ప్రియాంక పేర్కొన్నారు. డొరాండా ట్రెజరీ నుంచి అక్కమంగా సొమ్ములు విత్‌డ్రా చేసుకున్నారనే ఆరోపణల్లో లాలూను దోషిగా రాంచీలోని సీబీఐ ప్రత్యేక కోర్టు మంగళవారంనాడు ప్రకటించింది. ఇది పశుగ్రాసం కుంభకోణంలోని ఐదో కేసు కాగా, ఇంతకుముందే నాలుగు కేసుల్లోనూ లాలూ దోషిగా తేలారు.

Updated Date - 2022-02-18T21:30:57+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising