నన్పై రేప్ కేసులో బిషప్ ములక్కల్ నిర్దోషి
ABN, First Publish Date - 2022-01-15T08:22:46+05:30
మూడేళ్ల క్రితం కేరళలో తీవ్ర దుమారం రేపిన నన్పై అత్యాచారం కేసులో బిషప్ ఫ్రాంకో ములక్కల్ను నిర్దోషిగా కొట్టాయం కోర్టు ప్రకటించింది.
న్యూఢిల్లీ, కొట్టాయం, జనవరి 14: మూడేళ్ల క్రితం కేరళలో తీవ్ర దుమారం రేపిన నన్పై అత్యాచారం కేసులో బిషప్ ఫ్రాంకో ములక్కల్ను నిర్దోషిగా కొట్టాయం కోర్టు ప్రకటించింది. సరైన ఆధారాలు లేకపోవడంతో ఆయనపై అభియోగాలను కొట్టివేస్తున్నట్టు కొట్టాయం జిల్లా సెషన్స్ కోర్టు తీర్పు వెలువరించింది. జలంధర్లోని రోమన్ క్యాథలిక్ చర్చిలో బిష్పగా ఉన్న ఫ్రాంకో ములక్కల్ (57) 2014లో, తర్వాత తనపై అత్యాచారం చేశారంటూ 2018లో కేరళకు చెందిన 45 ఏళ్ల నన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కోర్టు తీర్పుపై బాధితురాలి సహచరులు, పోలీసులు, న్యాయవాదులు, సామాజిక కార్యకర్తలు దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. హైకోర్టును ఆశ్రయించాలని జాతీయ మహి ళా కమిషన్ చైర్పర్సన్ రేఖా శర్మ సూచించారు. ఈ తీర్పు ఆమోదయోగ్యం కాదని పట్ల ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) పేర్కొన్నది.
Updated Date - 2022-01-15T08:22:46+05:30 IST