ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఆంధ్రజ్యోతి పేపర్‌ను పార్థివదేహంపై ఉంచాలనేది అయన చివరి కోరిక

ABN, First Publish Date - 2022-04-05T20:28:06+05:30

ఆంధ్రజ్యోతి అభిమాని, రిటైర్డు ఉపాధ్యాయుడు సంపంగి రామయ్య (75) అనారోగ్యంతో సోమవారం మృతి చెందారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హోసూరు (బెంగళూరు): ఆంధ్రజ్యోతి అభిమాని, తెలుగు భాషాభిమాని, తెలుగు కోసం కృషి చేసిన రిటైర్డు ఉపాధ్యాయుడు సంపంగి రామయ్య (75) అనారోగ్యంతో సోమవారం మృతి చెందారు. హోసూరు నగరంలో భాషా ఉద్యమాల్లో చిన్ననాటి నుంచి చురుగ్గా పాల్గొనేవారు. తర్వాత ఉపాధ్యాయుడుగా పనిచేస్తూ.. తెలుగు భాష  కోసం కృషి చేశారు. తెలుగు భాష అంటే ఆయనకు ఎనలేని ప్రేమ. తెలుగుకు సంబంధించి ఎక్కడ ఏ కార్యక్రమాలు జరిగినా ఆయన ముందుండేవారు. తమిళనాడు తెలుగు సమ్మెళనంలో ఉపకార్యదర్శిగా, ఆంధ్ర సాంస్కృతిక సమితిలో కూడా పలు హోదాలకు ఆయన న్యాయం చేకూర్చారు. ఆంధ్రజ్యోతి పాత్రికేయుడిగా కొంత కాలం పనిచేశారు. సంపంగి రామయ్య చివరి కోరిక ప్రకారం కుటుంబసభ్యులు ఆంధ్రజ్యోతి పేపర్‌ను అయన పార్థివదేహంపై ఉంచారు. ఆయన టీచర్ ఉద్యోగం చేస్తూ ఆంధ్రజ్యోతి పేపర్ కోసం కష్టపడిన వ్యక్తి.. సంపంగి రామయ్య మృతిపట్ల ఆంధ్రజ్యోతి సిబ్బంది సంతాపం తెలుపుతూ.. ఆయన ఆత్మకు శాంతి కలగాలని దేవుడిని ప్రార్థిస్తున్నాం.

Updated Date - 2022-04-05T20:28:06+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising