ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Bengaluru ప్రజాప్రతినిధులతో సీఎం చర్చలు

ABN, First Publish Date - 2022-06-03T17:24:21+05:30

బృహత్‌ బెంగళూరు మహానగర పాలికె పరిధిలోని ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో ముఖ్యమంత్రి బసవరాజ్‌ బొమ్మై గురువారం ప్రత్యేక

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

                           - బీబీఎంపీ ఎన్నికలపైనే దృష్టి


బెంగళూరు, జూన్‌ 2 (ఆంధ్రజ్యోతి): బృహత్‌ బెంగళూరు మహానగర పాలికె పరిధిలోని ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో ముఖ్యమంత్రి బసవరాజ్‌ బొమ్మై గురువారం ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి పార్టీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు నళిన్‌కుమార్‌కటీల్‌ అధ్యక్షత వహించారు. బెంగళూరు మల్లేశ్వరంలోని బీజేపీ ప్రధాన కార్యాలయంలో దాదాపు రెండు గంటలకు పైగా ఈ సమావేశం జరిగింది. బీబీఎంపీకి మరో రెండు మూడు నెలల్లో ఎన్నికలు జరిగే అవకాశాలు కనిపిస్తుండటంతో ఈ సమావేశానికి రాజకీయ ప్రాధాన్యత లభించింది. నగర సమస్యలపైనే ప్రధానంగా చర్చించారని సమాచారం. బెంగళూరు సమగ్ర అభివృద్ధి కోసం చేపట్టాల్సిన చర్యలపై కూడా చర్చించినట్లు తెలిసింది. బెంగళూరు సెంట్రల్‌ లోక్‌సభ సభ్యుడు పీసీ మోహన్‌, నార్త్‌ సభ్యుడు, మాజీ సీఎం డీవీ సదానందగౌడతో పాటు సీనియర్లు పాల్గొన్నారు.

Updated Date - 2022-06-03T17:24:21+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising