గవర్నర్ ఖాతాను బ్లాక్ చేసిన మమత.. ఆమెకు పంపిన వాట్సాప్ మెసేజ్ను ట్వీట్ చేసిన ధన్ఖర్
ABN, First Publish Date - 2022-02-01T02:53:28+05:30
పశ్చిమ బెంగాల్ ముఖ్యమత్రి మమతా బెనర్జీ, ఆ రాష్ట్ర గవర్నర్ జగదీప్ ధన్ఖర్కు మధ్య పొసగడం లేదన్నది
కోల్కతా: పశ్చిమ బెంగాల్ ముఖ్యమత్రి మమతా బెనర్జీ, ఆ రాష్ట్ర గవర్నర్ జగదీప్ ధన్ఖర్కు మధ్య పొసగడం లేదన్నది పాత విషయమే. గవర్నర్ తీరు చాలా అభ్యంతరకరంగా ఉండడంతో తాను ఆయన ట్విట్టర్ ఖాతాను బ్లాక్ చేసినట్టు సోమవారం విలేకరులతో మాట్లాడుతూ మమత చెప్పారు.
ముఖ్యమంత్రి అలా పేర్కొన్న కాసేపటికే గవర్నర్ ధనకర్.. మమతకు పంపిన వాట్సాప్ మెసేజ్ను ట్విట్టర్లో షేర్ చేశారు. రాజ్యాంగ పదవుల్లో ఉన్న వారి మధ్య సామరస్యం ఉండాలని, చర్చలు జరగాలని, ప్రజాస్వామ్య సారాంశం అదేనని పేర్కొన్నారు. పరస్పర గౌరవంతోనే అది మరింత వికసిస్తుందని ఆ వాట్సాప్ మెసేజ్లో గవర్నర్ పేర్కొన్నారు. ఆమె పట్ల తనకు అత్యున్నత గౌరవం ఉందన్నారు. అంతేకాదు, ఆ మెసేజ్ను మమత సోమవారం ఉదయం 10.25 గంటలకు చదివినట్టు కూడా అందులో తెలిపారు.
Updated Date - 2022-02-01T02:53:28+05:30 IST