ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

బియాంత్ సింగ్ హత్య కేసు.. రాజోనాకు క్షమాభిక్షపై కేంద్రానికి గడువు ఇచ్చిన సుప్రీం

ABN, First Publish Date - 2022-05-02T21:29:57+05:30

పంజాబ్ మాజీ ముఖ్యమంత్రి బియాంత్ సింగ్ హత్య కేసులో మరణశిక్ష పడిన..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ: పంజాబ్ మాజీ ముఖ్యమంత్రి బియాంత్ సింగ్ హత్య కేసులో మరణశిక్ష పడిన బల్వంత్ సింగ్ రాజోనా క్షమాభిక్ష అభ్యర్థనపై రెండు నెలల్లోగా ఒక నిర్ణయం తీసుకోవాలని కేంద్రాన్ని సుప్రీంకోర్టు సోమవారంనాడు ఆదేశించింది. జస్టిస్ ఉదయ్ ఉమేష్ లలిత్‌ సారథ్యంలోని ధర్మాసనం సోమవారంనాడు ఈ ఆదేశాలు ఇచ్చింది. ఈ కేసులో దాదాపు 26 ఏళ్లుగా జైలులో ఉన్నందున తనకు విధించిన శిక్షను తగ్గించాలని, ఉరిశిక్షను యావజ్జీవ శిక్షగా మార్చాలని రాజోనా సుప్రీంకోర్టులో క్షమాభిక్ష పిటిషన్ వేశారు.


సిక్కులకు ప్రత్యేక రాష్ట్రం కోరుతూ 1995 ఆగస్టు 31న చండీగఢ్ సచివాలయం ముందు జరిగిన పేలుడులో బియాంత్ సింగ్‌తో పాటు మరో 16 మంది మరణించాడు. ఈ పేలుడులో కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న బల్వంత్ సింగ్ రాజోనా ప్రమేయమున్న్టటు ఆధారాలు ఉండటంతో ప్రత్యేక కోర్టు ఆయనకు మరణశిక్ష విధించింది. గత 26 ఏళ్లుగా ఆయన జైలుశిక్ష అనుభవిస్తుండగా, 2012 నుంచి ఆయన క్షమాభిక్ష పిటిషన్ పెండింగ్‌లో ఉంది.

Updated Date - 2022-05-02T21:29:57+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising