Tamil Nadu మాజీ మంత్రిపై ACB దాడులు
ABN, First Publish Date - 2022-07-08T19:23:22+05:30
ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో తమిళనాడు (Tamil Nadu) మాజీ మంత్రి
చెన్నై : ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో తమిళనాడు (Tamil Nadu) మాజీ మంత్రి, ఏఐఏడీఎంకే నేత ఆర్ కామరాజ్ (R Kamaraj)కు, ఆయన సన్నిహితులకు చెందిన 49 చోట్ల విజిలెన్స్, అవినీతి నిరోధక శాఖ అధికారులు సోదాలు నిర్వహించారు. ఈ కేసులో కామరాజ్ను, మరొక ఐదుగురిని నిందితులుగా పేర్కొన్నారు.
కామరాజ్ 2015-2021 మధ్య కాలంలో ఆహారం, పౌర సరఫరాల శాఖ మంత్రిగా పని చేశారు. ఆ కాలంలో ఆయన తన ఆదాయానికి మించి ఆస్తులను సంపాదించారని ఏసీబీ ఆరోపించింది. ఆయన ఆదాయానికి మించి రూ.58 కోట్లు సంపాదించినట్లు ఆరోపించింది.
డైరెక్టరేట్ ఆఫ్ విజిలెన్స్ అండ్ యాంటీ కరప్షన్ నిఘా నీడలోకి వచ్చిన ఏఐఏడీఎంకే మాజీ మంత్రుల్లో కామరాజు ఏడో వ్యక్తి. ఇదంతా రాజకీయ కక్ష సాధింపు అని ఏఐఏడీఎంకే ఆరోపించింది.
Updated Date - 2022-07-08T19:23:22+05:30 IST