బీజేపీలో అపర్ణ చేరికపై అఖిలేష్ కామెంట్..
ABN, First Publish Date - 2022-01-19T20:41:16+05:30
బీజేపీలోకి తమ కుటుంబ సభ్యురాలైన అపర్ణా యాదవ్ చేరడంపై సమాజ్వాదీ పార్టీ చీఫ్ అఖిలేష్ యాదవ్...
లక్నో: బీజేపీలోకి తమ కుటుంబ సభ్యురాలైన అపర్ణా యాదవ్ చేరడంపై సమాజ్వాదీ పార్టీ చీఫ్ అఖిలేష్ యాదవ్ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. బీజేపీలో చేరిన అపర్ణా యాదవ్కు అభినందనలు తెలియజేస్తున్నానని, సమాజ్వాదీ పార్టీ సిద్ధాంతం (ఐడియాలజీ) ఇప్పుడు బీజేపీ గడపతొక్కడం మంచిదేనని అన్నారు. ''ముందుగా అపర్ణకు కంగ్రాట్స్ చెబుతున్నాను. సోషలిస్ట్ ఐడియాలజీ విస్తరిస్తుండటం చాలా సంతోషంగా ఉంది. నేతాజా (ములాయం సింగ్ యాదవ్) చాలా చెప్పేందుకు ప్రయత్నించారు. కానీ ఫలితం లేకపోయింది'' అని అఖిలేష్ పేర్కొన్నారు.
సమాజ్ వాది పార్టీ వ్యవస్థాపకుడు ములాయం సింగ్ యాదవ్ చిన్నకోడలైన అపర్ణ బుధవారంనాడు బీజేపీలో చేరారు. ప్రధాని మోదీ, బీజేపీ విధానాలు, సిద్ధాంతాల పట్ల తాను ఆకర్షితురాలినయ్యానని, తరచు మాట్లాడుతుండే దానినని అపర్ణ తెలిపారు. జాతీయతావాదం తన జీవితంలో ఒక భాగమని, ఏదైనా సరే దేశం తర్వాతేనని తాను నమ్ముతానని అన్నారు. లక్నో కంటోన్మెంట్ సీటులో పోటీ చేసే విషయమై మాట్లాడుతూ, పార్టీ ఏమి చెబితే అది చేస్తానని తెలిపారు.
Updated Date - 2022-01-19T20:41:16+05:30 IST