ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

నా హెలికాప్టర్‌ను ఢిల్లీలో ఆపేశారు: అఖిలేష్ ఫైర్

ABN, First Publish Date - 2022-01-28T21:51:32+05:30

ఢిల్లీ నుంచి ఉత్తరప్రదేశ్‌లోని ముజఫర్‌నగర్ వెళ్లడానికి తన హెలికాప్టర్‌ను అనుమతించ లేదని..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ: ఢిల్లీ నుంచి ఉత్తరప్రదేశ్‌లోని ముజఫర్‌నగర్ వెళ్లడానికి తన హెలికాప్టర్‌ను అనుమతించ లేదని సమాజ్‌వాదీ పార్టీ చీఫ్ అఖిలేష్ యాదవ్ శుక్రవారంనాడు తెలిపారు. ఇది బీజేపీ కుట్రేనని ఆరోపించారు. ''ఏ కారణం లేకుండానే నా హెలికాప్టర్‌ను ఢిల్లీలో ఆపేశారు. ముజఫర్‌నగర్ వెళ్లేందుకు అనుమతించ లేదు. ఇప్పుడే బీజేపీ అగ్రనేత ఒకరు ఇక్కడి నుంచి వెళ్లారు. ఓడిపోతామని తెలిసే ఇలాంటి కుట్రలు సాగిస్తున్నారు. ప్రజలు ప్రతీదీ గమినిస్తున్నారు'' అని అఖిలేష్ ఓ ట్వీట్‌లో పేర్కొన్నారు.


కాగా, మరో అరగంట తర్వాత అఖిలేష్ ఇంకో ట్వీట్ చేశారు. హెలికాఫ్టర్‌లో వెళ్లేందుకు అనుమతించినట్టు అందులో పేర్కొన్నారు. సోషలిస్ట్ పోరాటంలో ఈ రోజు చరిత్రలో నిలిచి పోతుందని, తాము విజయ విహారం చేయబోతున్నామని అఖిలేష్ అందులో పేర్కొన్నారు. షెడ్యూల్ ప్రకారం శుక్రవారం మధ్యాహ్నం ముజఫర్‌నగర్, మీరట్‌లో ఆయన ఎన్నికల ప్రచారం సాగించాల్సి ఉంది.

Updated Date - 2022-01-28T21:51:32+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising