ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కీవ్‌లో ల్యాండైన ఎయిర్ ఇండియా తొలి విమానం

ABN, First Publish Date - 2022-02-22T21:38:18+05:30

ఉక్రెయిన్-రష్యా మధ్య నెలకొన్న ఉద్రిక్తతల నేపథ్యంలో అక్కడ చిక్కుకుపోయిన భారతీయ విద్యార్థులను

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కీవ్: ఉక్రెయిన్-రష్యా మధ్య నెలకొన్న ఉద్రిక్తతల నేపథ్యంలో అక్కడ చిక్కుకుపోయిన భారతీయ విద్యార్థులను వెనక్కి తీసుకొచ్చేందుకు బయలుదేరిన మూడు ఎయర్ ఇండియా విమానాల్లో తొలి విమానం కొద్దిసేపటి క్రితం ఉక్రెయిన్ రాజధాని కీవ్‌లో ల్యాండ్ అయింది. 200 సీట్ల సామర్థ్యం కలిగిన ఈ డ్రీమ్‌లైనర్ బి-787 విమానం ఈ రాత్రికి తిరిగి ఢిల్లీ చేరుకుంటుంది.


మిగతా రెండు విమానాల్లో ఒకటి ఈ నెల 24న, 26న మరోటి రానున్నాయి. వీటికోసం ఇప్పటికే బుకింగ్స్ ప్రారంభమయ్యాయి. ఎయిర్ ఇండియా బుకింగ్ కార్యాలయాలు, వెబ్‌సైట్ ద్వారా బుక్ చేసుకోవచ్చు. రష్యా-ఉక్రెయిన్ మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో అక్కడ నివసిస్తున్న భారతీయ పౌరులు తాత్కాలికంగా దేశాన్ని విడిచి రావాలని భారత ప్రభుత్వం సూచించింది. ఉక్రెయిన్‌ సరిహద్దు ప్రాంతాలు సహా దేశంలోని వివిధ ప్రాంతాల్లో 20 వేల మందికిపైగా భారత విద్యార్థులు నివసిస్తున్నారు.

Updated Date - 2022-02-22T21:38:18+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising