ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

చైనా అక్రమ వంతెనను మోదీ ప్రారంభిస్తారేమోనని భయంగా ఉంది : రాహుల్ గాంధీ

ABN, First Publish Date - 2022-01-19T23:05:29+05:30

వాస్తవాధీన రేఖ (ఎల్ఏసీ) వెంబడి పాంగాంగ్ సో సరస్సు తీరంలో,

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ : వాస్తవాధీన రేఖ (ఎల్ఏసీ) వెంబడి పాంగాంగ్ సో సరస్సు తీరంలో, భారత భూభాగంలో ఓ వంతెనను చైనా సైన్యం (పీఎల్ఏ) అక్రమంగా నిర్మిస్తోందని, దీనిని ప్రారంభించేందుకు కూడా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ వెళ్తారేమోనని భయంగా ఉందని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ బుధవారం వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ఈ వంతెన నిర్మాణంపై ప్రధాన మంత్రి ఎందుకు మౌనంగా ఉన్నారని జనవరి 4న కూడా రాహుల్ ప్రశ్నించారు. 


రాహుల్ బుధవారం ఇచ్చిన ట్వీట్‌లో, ‘‘మన దేశంలో చైనా చట్టవిరుద్ధంగా ఓ వంతెనను నిర్మిస్తోంది. ప్రధాన మంత్రి మౌనం వల్ల పీఎల్ఏ ఆత్మవిశ్వాసం పెరుగుతోంది. ఇప్పుడున్న భయం ఏమిటంటే, ఈ వంతెనను ప్రారంభించేందుకు కూడా పీఎం వెళ్ళరు కదా అనేదే’’ అని పేర్కొన్నారు. ఈ ట్వీట్‌తోపాటు ఓ వీడియోను షేర్ చేశారు. 


పాంగాంగ్ సో సరస్సుపై వంతెన నిర్మాణం వల్ల చైనా దళాలు సులువుగా ప్రయాణించగలుగుతాయి. 8 మీటర్ల వెడల్పుతో ఈ వంతెనను నిర్మిస్తున్నట్లు జాతీయ మీడియా తెలిపింది. పాంగాంగ్ సో సరస్సు ఉత్తర తీరంలో, చైనా ఆర్మీ ఫీల్డ్‌కు దక్షిణ దిశలో ఈ వంతెన ఉన్నట్లు తెలిపింది. 2020లో ఇరు దేశాల దళాల మధ్య ప్రతిష్టంభన ఏర్పడినపుడు ఈ ప్రాంతంలో చైనా దళాలకు ఆసుపత్రులు, వసతి సదుపాయాలు ఉన్నట్లు తెలిసింది. 


తూర్పు లడఖ్‌ వెంబడి సరిహద్దుల్లో పరిస్థితులను నరేంద్ర మోదీ ప్రభుత్వం చక్కదిద్ద లేకపోతోందని కాంగ్రెస్, రాహుల్ గాందీ తీవ్రంగా విమర్శిస్తున్న సంగతి తెలిసిందే.




Updated Date - 2022-01-19T23:05:29+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising