పోలీస్ స్టేషన్లో ఉరేసుకున్న నిందితుడు
ABN, First Publish Date - 2022-02-20T23:35:36+05:30
వేధింపులు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఒక నిందితుడు పోలీస్ స్టేషన్లో విచారణలో ఉండగా ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. రాజస్తాన్ రాజధాని జైపూర్లోని జవహార్ నగర్ పోలీస్ స్టేషన్లో ఆదివారం జరిగిందీ ఘటన..
జైపూర్: వేధింపులు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఒక నిందితుడు పోలీస్ స్టేషన్లో విచారణలో ఉండగా ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. రాజస్తాన్ రాజధాని జైపూర్లోని జవహార్ నగర్ పోలీస్ స్టేషన్లో ఆదివారం జరిగిందీ ఘటన. అంకిత్ గుప్త (32) అనే వ్యక్తి ఒక మైనర్ బాలిక(10)పై వేధింపులకు పాల్పడినట్లు ఫిబ్రవరి 28న ఎఫ్ఐఆర్ నమోదు అయింది. అతడిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. ఒక జవహార్ నగరే కాకుండా మరో మూడు పోలీస్ స్టేషన్లలో అంకిత్పై ఇదే చట్టం కింద కేసులు నమోదు అయ్యాయి. అయితే అవి 2014, 2016, 2017లలో ఒక్కో కేసు నమోదు అయింది. వీటితో పాటు 2014లో ఒక యాక్సిడెంట్ కేసు కూడా నమోదు అయింది. ఇక తాజాగా ఎఫ్ఐఆర్లో నిందితుడిని సీసీటీవీ పుటేజీ ఆధారంగా వివరాలు సేకరించి అరెస్ట్ చేశారు. అనంతరం బాధితురాలి వాంగ్మూలం కూడా తీసుకున్నారు. నిందితుడికి ఏడు నెలల క్రితమే పెళ్లైనట్లు పోలీసులు తెలిపారు.
Updated Date - 2022-02-20T23:35:36+05:30 IST