ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Delhi Criminals : ఓ వ్యక్తిని దారుణంగా గొంతు కోసి హత్య చేసిన అన్నదమ్ములు

ABN, First Publish Date - 2022-06-04T20:18:27+05:30

దేశ రాజధాని నగరం ఢిల్లీలోని ఆదర్శ నగర్‌లో ఓ వ్యక్తిని ఇద్దరు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ : దేశ రాజధాని నగరం ఢిల్లీలోని ఆదర్శ నగర్‌లో ఓ వ్యక్తిని ఇద్దరు అన్నదమ్ములు దారుణంగా చిత్రహింసలకు గురి చేశారు. బ్లేడుతో గొంతు కోసి, రాళ్ళతో తలపై మోది హత్య చేశారు. ఒళ్లు గగుర్పొడిచే ఈ సన్నివేశం సీసీటీవీలో రికార్డయింది. అయితే బాధితుడు, నిందితులు నేర చరిత్రగలవారని పోలీసులు తెలిపారు. 


బాధితుడు నరేంద్ర వురపు బంటీని రోహిత్ కలి, రాహుల్ కలి కలిసి చిత్ర హింసలకు గురి చేసినట్లు సీసీటీవీ ఫుటేజ్‌లో కనిపిస్తోందని ఢిల్లీ పోలీసులు తెలిపారు. నరేంద్ర తరచూ మాదక ద్రవ్యాల కోసం రాహుల్‌ను డబ్బులు అడిగేవాడని చెప్పారు. రాహుల్ విసుగెత్తిపోయి తన సోదరుడు రోహిత్‌తో కలిసి నరేంద్రపై దాడి చేశారని తెలిపారు. ఓ బ్లేడుతో నరేంద్ర గొంతును కోసి, రాళ్ళు, రాడ్లతో అతని తలపై కొట్టారని చెప్పారు. చనిపోతాడనే నమ్మకం కలిగే  వరకు కొట్టారన్నారు. ఈ సంఘటనను అక్కడికి సమీపంలో ఉన్నవారు భయభ్రాంతులకు గురై చూస్తూ ఉండిపోయారని తెలిపారు. బాధితుడిని ఆసుపత్రికి తరలించినప్పటికీ, ఆయన ప్రాణాలు కోల్పోయారని తెలిపారు. 


రాహుల్, రోహిత్‌లపై కేసు నమోదు చేసినట్లు తెలిపారు. రాహుల్‌ను అరెస్టు చేశామని, పరారీలో ఉన్నరోహిత్  కోసం గాలిస్తున్నామని చెప్పారు. 


Updated Date - 2022-06-04T20:18:27+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising