ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Madhya Pradesh: విద్యుదాఘాతంతో చిరుతపులిని చంపిన వేటగాళ్లు... ఇద్దరి అరెస్ట్...

ABN, First Publish Date - 2022-08-06T20:14:08+05:30

మధ్య ప్రదేశ్‌ (Madhya Pradesh)లో వేటగాళ్ళు అత్యంత దారుణాలకు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

భోపాల్ : మధ్య ప్రదేశ్‌ (Madhya Pradesh)లో వేటగాళ్ళు అత్యంత దారుణాలకు పాల్పడుతున్నారు. విద్యుత్ షాక్ తగిలేవిధంగా చేసి ఓ చిరుతపులి (leopard)ని చంపేశారు. ఈ కేసులో ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. ఇతర జంతువుల కోసం వేసిన ఈ వలలో ఈ చిరుతపులి పడినట్లు అనుమానిస్తున్నారు. 


డివిజినల్ ఫారెస్ట్ ఆఫీసర్ (నార్త్) గౌరవ్ చౌదరి మీడియాతో మాట్లాడుతూ, బియోహరి అడవిలో ఖర్పా బీట్ వద్ద తుప్పల్లో మరణించిన ఓ చిరుతపులి కనిపించిందని చెప్పారు. సంజయ్ పులుల అభయారణ్యం (Sanjay Tiger Reserve) నుంచి జాగిలాలను రప్పించి ఆధారాల సేకరణ కోసం ప్రయత్నించామన్నారు. వేటగాళ్ళు విద్యుత్తు తీగెలతో ఏర్పాటు చేసిన వలలో పడి ఈ చిరుతపులి మరణించినట్లు ప్రాథమిక దర్యాప్తులో తేలిందన్నారు. వేటగాళ్లు ఈ వలను ఇతర జంతువుల కోసం ఏర్పాటు చేసి ఉంటారన్నారు. ఈ చిరుతపులి మృతదేహాన్ని వేటగాళ్ళు సమీపంలోని తుప్పల్లో పడేశారన్నారు. ఈ కేసులో ఇద్దరిని అదుపులోకి తీసుకున్నామని చెప్పారు. 


Updated Date - 2022-08-06T20:14:08+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising