58 ఏళ్ల అనంతరం బయల్పడిన నేల వంతెన
ABN, First Publish Date - 2022-05-24T17:03:01+05:30
ధనుష్కోటిలో అలల తాకిడికి 58 ఏళ్ల క్రితం పూడుకుపోయిన నేల వంతెన బయల్పడింది. రామేశ్వరం నుంచి సుమారు 25 కి.మీ దూరంలో ఉన్న ధనుష్కోతి ప్రాంతం,
పెరంబూర్(చెన్నై): ధనుష్కోటిలో అలల తాకిడికి 58 ఏళ్ల క్రితం పూడుకుపోయిన నేల వంతెన బయల్పడింది. రామేశ్వరం నుంచి సుమారు 25 కి.మీ దూరంలో ఉన్న ధనుష్కోతి ప్రాంతం, 1964వ సంవత్సరానికి ముందు వరకు రామేశ్వరం కన్నా పెద్ద వాణిజ్య నగరంగా ప్రసిద్ధిచెందింది. అలాగే, ధనుష్కోటి నుంచి శ్రీలంకకు నౌక సవారీ, ధనుష్కోటి వరకు రైలుమార్గం ఉండేది. పాఠశాలలు, తపాలా కార్యాలయం, ఆస్పత్రి, ఆలయాలు, హార్బర్ తదితర వసతులతో ప్రధాన వాణిజ్య, పర్యాటక కేంద్రంగా కొనసాగేది. 1964 డిసెంబరు 23న సంభవించిన భారీ తుఫాను కారణంగా ధనుష్కోటి నగరం పూర్తిగా ధ్వంసమైంది. తుఫాను తర్వాత ఆ ప్రాంతానికి పర్యాటకులు వెళ్లకుండా ప్రభుత్వం నిషేధం విధించగా, కొందరు జాలర్లు మాత్రం అక్కడే గుడిసెలు వేసుకొని జీవిస్తున్నారు. ఈ క్రమంలో, వారం రోజులుగా ఈ ప్రాంతంలో ఈదురుగాలులతో భారీగా అలలు ఎగిసిపడుతుండడంతో పలు ప్రాంతాల్లో సముద్రపుతీరం కోతకు గురైంది. దీంతో, 1964లో తుఫాను కారణంగా సముద్రంలో మునిగిన నేల వంతెన బయల్పడింది. కాంక్రీట్ దిమ్మెల మీద నేత వంతెన నిర్మించారు.
Updated Date - 2022-05-24T17:03:01+05:30 IST