ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Meghalaya: భారీ వరదలు, విరిగిన కొండచరియలు.. నలుగురు మృతి

ABN, First Publish Date - 2022-06-09T19:40:14+05:30

మేఘాలయలోని పశ్చిమ గారో హిల్స్ ప్రాంతంలో గురువారం రెండు వేరు వేరు ప్రాంతాల్లో కొండ చరియలు విరిగి పడి ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు వ్యక్తులు మరణించారు. అదే కుటుంబానికి చెందిన మరో ఇద్దరు గాయపడగా వారిని స్థానిక ఆసుపత్రికి తీసుకెళ్లి చికిత్స అందిస్తున్నారు..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

షిల్లాంగ్: మేఘాలయలోని పశ్చిమ గారో హిల్స్ ప్రాంతంలో గురువారం రెండు వేరు వేరు ప్రాంతాల్లో కొండ చరియలు విరిగి పడి ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు వ్యక్తులు మరణించారు. అదే కుటుంబానికి చెందిన మరో ఇద్దరు గాయపడగా వారిని స్థానిక ఆసుపత్రికి తీసుకెళ్లి చికిత్స అందిస్తున్నారు. అయితే వారి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సదరు ఆసుపత్రి వైద్యులు తెలిపారు. ఇక రాష్ట్రంలోని వరదల కారణంగా బుధవారం రాత్రి రెండున్నరేళ్ల చిన్నారి మృతి చెందినట్లు స్థానిక పోలీసులు తెలిపారు. రాష్ట్రంలో భారీగా పడుతున్న వర్షాలకు వరదలు పోటెత్తాయి. కాగా, భారత వాతావరణ శాఖ అధికారులు రాష్ట్రంలో ఇప్పటికే ఆరెంజ్ అలర్ట్‌ని ప్రకటించారు. వరద తీవ్రత ఎక్కువగా ఉండే ప్రదేశాలను గుర్తించి ముందస్తు చర్యలు తీసుకున్నట్లు ఐఎండీ అధికారులు తెలిపారు.

Updated Date - 2022-06-09T19:40:14+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising