ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Bangladesh Boat Accident: బంగ్లాదేశ్‌లో విషాదం.. పడవ మునిగి 23 మంది జలసమాధి

ABN, First Publish Date - 2022-09-25T23:51:35+05:30

బంగ్లాదేశ్‌ (Bangladesh)లో ప్రయాణికుల పడవ మునిగిన ఘటనలో 23 మంది జలసమాధి అయ్యారు. పదుల

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఢాకా: బంగ్లాదేశ్‌ (Bangladesh)లో ప్రయాణికుల పడవ మునిగిన ఘటనలో 23 మంది జలసమాధి అయ్యారు. పదుల సంఖ్యలో గల్లంతయ్యారు. ఉత్తర పంచగఢ్‌ (northern Panchagarh)లో జరిగిన ఈ ప్రమాదం సంభవించినట్టు జిల్లా అధికారి జహురుల్ ఇస్లాం తెలిపారు. ఇప్పటి వరకు వెలికి తీసిన మృతదేహాల్లో పలువురు మహిళలు, చిన్నారులు ఉన్నారని, గల్లంతైన వారికి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయని చెప్పారు. ఎంతమంది గల్లంతయ్యారన్న స్పష్టమైన సమాచారం లేదన్న ఆయన ప్రమాద సమయంలో బోటులో 70 మందికిపైగా ప్రయాణికులు ఉన్నట్టు ప్రత్యక్ష సాక్షులు చెప్పారన్నారు.  


బంగ్లాదేశ్‌లో పడవ ప్రమాదాలు నిత్యకృత్యమయ్యాయి. ప్రతి ఏడాది వందలాదిమంది ఇటువంటి ఘటనల్లో ప్రాణాలు కోల్పోతున్నారు. ఇక్కడ ప్రయాణానికి ఎక్కువ మంది జలమార్గాలనే ఎంచుకుంటారు. అయినప్పటికీ సరైన సౌకర్యాలు, భద్రతా పరమైన చర్యలు చేపట్టకపోవడంతో తరచూ ప్రమాదాలు జరిగి వందలాదిమంది జలసమాధి అవుతున్నారు.  పద్మా నదిలో ఈ ఏడాది మేలో ప్రయాణికులతో వెళ్తున్న స్పీడ్‌బోటు ఓ ఇసుక కేరియర్‌ను ఢీకొట్టడంతో 26 మంది ప్రాణాలు కోల్పోయారు.  

Updated Date - 2022-09-25T23:51:35+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising