ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Pakistan: లోయలో పడిన బస్సు.. 19 మంది దుర్మరణం

ABN, First Publish Date - 2022-07-04T02:26:09+05:30

పాకిస్థాన్‌లో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో 19 మంది మరణించారు. మరో 14 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఇస్లామాబాద్

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కరాచీ: పాకిస్థాన్‌లో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో 19 మంది మరణించారు. మరో 14 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఇస్లామాబాద్ (Islamabad) నుంచి 30 మంది ప్రయాణికులతో క్వెట్టా (Quetta) వెళ్తున్న బస్సు మరికాసేపట్లో గమ్యానికి చేరుకుంటుందనగా జోబ్ సమీపంలో అదుపు తప్పి లోయలో పడింది. ఈ ఘటనలో 19 మంది అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మరో 14 మంది తీవ్రంగా గాయపడ్డారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. 


సమాచారం అందుకున్న వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను వెంటనే సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. అతివేగం, వర్షమే ప్రమాదానికి కారణమని ప్రాథమికంగా నిర్ధారించారు. ప్రమాద ఘటనపై పాక్ ప్రధాని షెహబాద్ షరీఫ్ (Shehbaz Sharif), బలూచిస్థాన్ ముఖ్యమంత్రి మీర్ అబ్దుల్ ఖుదూస్ (Mir Abdul Quddus Bizenjo) తీవ్ర విచారం వ్యక్తం చేశారు.



Updated Date - 2022-07-04T02:26:09+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising