ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఇటలీ నుంచి అమృత్‌సర్‌కు మరో విమానం.. 150 మంది ప్రయాణికులకు ‘పాజిటివ్’

ABN, First Publish Date - 2022-01-07T22:54:26+05:30

ఇటలీ నుంచి పంజాబ్‌లోని అమృత్‌సర్‌కు వస్తున్న విమానాలు కరోనా మహమ్మారిని మోసుకొస్తున్నట్టుగా..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమృత్‌సర్: ఇటలీ నుంచి పంజాబ్‌లోని అమృత్‌సర్‌కు వస్తున్న విమానాలు కరోనా మహమ్మారిని మోసుకొస్తున్నట్టుగా ఉన్నాయి. నిన్న ఇటలీ నుంచి అమృత్‌సర్‌కు వచ్చిన ఎయిర్ ఇండియా విమానంలో 125 మందికి కరోనా సోకినట్టు నిర్ధారణ అయింది. దీంతో వీరందరి నుంచి నమూనాలు సేకరించిన అధికారులు జినోమ్ సీక్వెన్స్‌కు పంపారు. బాధిత ప్రయాణికులందరినీ ఐసోలేషన్‌లో ఉంచారు.


ఇది జరిగి ఒక్క రోజైనా కాకముందే ఇటలీ నుంచి నేడు అమృత్‌సర్‌లోని అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకున్న విమానంలో 150 మందికి కరోనా సోకినట్టు నిర్దారణ అయింది. విమానంలో మొత్తం 290 మంది ప్రయాణికులు ఉన్నట్టు అధికారులు తెలిపారు. వీరి నమూనాలను కూడా జినోమ్ సీక్వెన్సింగ్‌కు పంపనున్నట్టు తెలుస్తోంది. అలాగే, పాజిటివ్‌గా తేలినవారిని ఐసోలేషన్‌కు తరలించనున్నారు.

Updated Date - 2022-01-07T22:54:26+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising