ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

బస్సు లోయలో పడి 13 మంది దుర్మరణం

ABN, First Publish Date - 2022-07-05T07:49:38+05:30

హిమాచల్‌ప్రదేశ్‌లో సోమవారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఓ మలుపు వద్ద అదుపు తప్పిన బస్సు 200 అడుగుల లోయలో పడటంతో 13 మంది దుర్మరణం చెందారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఇద్దరికి తీవ్ర గాయాలు 

హిమాచల్‌ ప్రదేశ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం


సిమ్లా/మనాలి, జూలై 4: హిమాచల్‌ప్రదేశ్‌లో సోమవారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఓ మలుపు వద్ద అదుపు తప్పిన బస్సు 200 అడుగుల లోయలో పడటంతో 13 మంది దుర్మరణం చెందారు. షెయిన్‌షేర్‌ నుంచి కులు వెళ్తున్న ప్రైవేటు బస్సు  జంగ్లా గ్రామ సమీపంలో ప్రమాదానికి గురైంది. ఉదయం ఎనిమిదిన్నర గంటల సమయంలో ప్రమాదం జరగ్గా పలువురు పాఠశాల విద్యార్థులు సహా 13 మంది ప్రయాణికులు ప్రాణాలు కోల్పోయారు. మరో ఇద్దరు తీవ్ర గాయాలతో ఆస్పత్రి పాలయ్యారు. ఈ దుర్ఘటన గురించి తెలుసుకున్న రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌, ప్రధాని మోదీ దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు రూ.2లక్షలు, క్షతగాత్రులకు రూ.50వేల చొప్పున ప్రధాని పరిహారం ప్రకటించారు. ఘటనపై విచారణకు ఆదేశించిన హిమాచల్‌ప్రదేశ్‌ సీఎం జైరామ్‌ ఠాకూర్‌.. మృతుల కుటుంబాలకు రూ.5లక్షలు, క్షతగాత్రులకు సాయంగా రూ.15వేల చొప్పున ప్రకటించారు. కాంగ్రెస్‌ నేతలు రాహుల్‌, ప్రియాంక గాంధీ బాధితకుటుంబాలకు సంతాపం తెలియజేశారు.

Updated Date - 2022-07-05T07:49:38+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising