11 రోజులు... 24 గంటల పుస్తక పఠనం
ABN, First Publish Date - 2022-03-20T15:45:37+05:30
తిరేనల్వేలిలో 5వ పుస్తక ప్రదర్శన గురువారం ప్రారంభమైంది. 11 రోజులు నిర్వహించనున్న ఈ పుస్తక ప్రదర్శనకు ప్రతిరోజు ఉదయం 11 నుంచి రాత్రి 9 గంటల వరకు
పెరంబూర్(చెన్నై): తిరేనల్వేలిలో 5వ పుస్తక ప్రదర్శన గురువారం ప్రారంభమైంది. 11 రోజులు నిర్వహించనున్న ఈ పుస్తక ప్రదర్శనకు ప్రతిరోజు ఉదయం 11 నుంచి రాత్రి 9 గంటల వరకు ప్రజలను అనుమతించనున్నారు. వీఓసీ మైదానంలో నిర్వహించిన ఈ ప్రదర్శనలో 126 స్టాల్స్ ఏర్పాటుచేశారు. ఈ ప్రదర్శన సందర్భంగా పాఠశాల, కళాశాల విద్యార్థి, విద్యార్థినులు 11 రోజులు 24 గంటల పాటు పుస్తక పఠనం చేసి గిన్నిస్ రికార్డు సాధించేందుకు సిద్ధమయ్యారు. ఈ పుస్తక పఠన వేదికను కలెక్టర్ విష్ణు సందర్శించి, విద్యార్థినీ, విద్యార్థులను అభినందించారు.
Updated Date - 2022-03-20T15:45:37+05:30 IST