ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అఖిలేశ్ యాదవ్ ఈవీఎంల తరలింపు ఆరోపణలపై ఈసీ యాక్షన్.. అధికారిపై వేటు!

ABN, First Publish Date - 2022-03-10T01:16:58+05:30

ఓట్ల లెక్కింపునకు రెండు రోజుల ముందు ఈవీఎంలను ఓ వ్యాన్‌లో అక్రమంగా తరలించడం

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

లక్నో: ఓట్ల లెక్కింపునకు రెండు రోజుల ముందు ఈవీఎంలను ఓ వ్యాన్‌లో అక్రమంగా తరలించడం ఉత్తరప్రదేశ్‌లో పెను వివాదానికి దారితీసింది. సమాజ్‌వాదీ పార్టీ చీఫ్ అఖిలేశ్ యాదవ్ ఈ విషయాన్ని నిన్న వెలుగులోకి తీసుకొచ్చారు. మంగళవారం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ఎన్నికల కమిషన్ అధికారులు ఈవీఎంలను ట్యాంపరింగ్ చేశారని ఆరోపించారు.


స్థానిక అభ్యర్థులకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండానే వారణాసి కలెక్టర్ ఈవీఎంలను తరలించారని ఆరోపించారు. ఈ విషయంపై ఎన్నికల సంఘం దృష్టిసారించాలని కోరారు. అఖిలేశ్ ఆరోపణలను నిజం చేస్తూ బుధవారం ఉదయం సమాజ్‌వాదీ పార్టీ తన ట్విట్టర్ ఖాతాలో ఓ వీడియోను షేర్ చేసింది.


ఆ వీడియోలో వారణాసి కమిషనర్ దీపక్ అగర్వాల్ మాట్లాడుతూ.. ఈవీఎంల తరలింపులో లోపం జరిగిన మాట వాస్తవమేనని, దానిని తాను అంగీకరిస్తానని అన్నారు. ఈ వీడియో కూడా కలకలం రేపింది. దీంతో స్పందించిన ఎన్నికల కమిషన్ వెంటనే రంగంలోకి దిగింది.


వారాణాసి ఏడీఎంపై చర్యలు తీసుకోవాలంటూ  ఉత్తరప్రదేశ్ ముఖ్య ఎన్నికల అధికారి (సీఈవో)ను ఆదేశించింది. జిల్లా కలెక్టర్ కౌశల్ రాజ్  శర్మ మాట్లాడుతూ.. ఈవీఎంలను ఈ రోజు తరలించాల్సి ఉందని, కానీ ఎవరికీ ఎలాంటి సమాచారం ఇవ్వకుండా ఏడీఎం ఎన్‌కే సింగ్‌ తరలించారని చెప్పారు. ఆయన ఇప్పుడు సస్పెండ్ అయ్యారని పేర్కొన్నారు. 

Updated Date - 2022-03-10T01:16:58+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising