ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కెప్టెన్ అమరీందర్ నామినేషన్..మాదే ప్రభుత్వమన్న కేంద్ర మంత్రి

ABN, First Publish Date - 2022-01-31T19:29:27+05:30

పంజాబ్ మాజీ ముఖ్యమంత్రి, పంజాబ్ లోక్‌ కాంగ్రెస్ (పీఎల్‌సీ) వ్యవస్థాపకుడు...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పాటియాలా: పంజాబ్ మాజీ ముఖ్యమంత్రి, పంజాబ్ లోక్‌ కాంగ్రెస్ (పీఎల్‌సీ) వ్యవస్థాపకుడు కెప్టెన్ అమరీందర్ సింగ్ సోమవారంనాడు నామినేషన్ వేశారు. పాటియాలాలో ఎన్నికల అధికారులకు తన నామినేషన్ పత్రాన్ని అందజేశారు. పాటియాలా నియోజకవర్గం నుంచి కెప్టెన్ అమరీందర్ పోటీ చేస్తున్నారు. కెప్టెన్ నామినేషన్ కార్యక్రమానికి కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ ఎస్.షెకావత్, పలువురు నేతలు హాజరయ్యారు. పంజాబ్‌లో బీజేపీ-పంజాబ్ లోక్ కాంగ్రెస్ కలిసి పోటీ చేస్తున్నాయి.


చరిత్ర సృష్టిస్తాం...

కెప్టెన్ అమరీందర్ సింగ్ నామినేషన్ అనంతరం మీడియాతో గజేంద్ర సింగ్ షెకావత్ మాట్లాడుతూ, బీజేపీ-పీఎల్‌సీ కూటమి పాటియాలాతో సహా 117 సీట్లలోనూ చరిత్ర సృష్టిస్తుందని చెప్పారు. పంజాబ్ ప్రజలకు రాష్ట్ర భద్రత, దేశ భద్రత చాలా ముఖ్యమని, అదే లక్ష్యంతో తమ కూటమి పోటీ చేస్తోందని చెప్పారు.  తప్పనిసరిగా తమ కూటమి పంజాబ్‌లో ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు.

Updated Date - 2022-01-31T19:29:27+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising