ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పచ్చకామెర్ల వాళ్లకి అలాగే కనిపిస్తుంది: అమిత్‌షా

ABN, First Publish Date - 2022-02-15T20:11:47+05:30

ఉత్తరప్రదేశ్‌ను బీజేపీ ప్రభుత్వం ఏమి అభివృద్ధి చేసిందని సమాజ్‌వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

దబియాపూర్: ఉత్తరప్రదేశ్‌ను బీజేపీ ప్రభుత్వం ఏమి అభివృద్ధి చేసిందని సమాజ్‌వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్ ప్రశ్నించడాన్ని కేంద్ర హోం మంత్రి అమిత్‌షా తిప్పికొట్టారు. పసుపుపచ్చ కళ్లదాలతో చూసే వాళ్లకి ప్రతీదీ ఆ రంగులోనే కనిపిస్తుందని ఛలోక్తులు విసిరారు. ఉత్తరప్రదేశ్‌లోని దిబియాపూర్‌లో మంగళవార జరిగిన ఎన్నికల ప్రచారసభలో అమిత్‌షా మాట్లాడుతూ, అఖిలేష్ ప్రభుత్వం తుపాకులు, తూటాలు తయారుచేసేదని అన్నారు. ఇప్పుడు తూటాలకు (గోలీ) బదులు లక్ష్యం (గోల్) సిద్ధం చేసుకున్నామని, పాక్‌కు కాల్పులతోనే దీటుగా సమాధానమిస్తున్నామని చెప్పారు.


10న ఫలితాలు, 18న హోలీ

మార్చి 18వ తేదీన హోలీ పండుగ వస్తోందని, దీనికి ముందే 10న కౌంటింగ్ జరుగుతుందని అమిత్‌షా చెప్పారు. 10వ తేదీన బీజేపీ ప్రభుత్వాన్ని గెలిపించగానే 18న ఉచిత గ్యాస్ సిలెండర్లు మీ ఇంటికి వచ్చి చేరుతాయని అన్నారు. రైతులు వచ్చే ఐదేళ్లు విద్యుత్ బిల్లులు చెల్లించనక్కర లేదని తెలిపారు.

Updated Date - 2022-02-15T20:11:47+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising