ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కేజ్రీవాల్‌పై ఎఫ్ఐఆర్‌ నమోదుకు ఈసీ ఆదేశం

ABN, First Publish Date - 2022-02-20T01:11:51+05:30

ఆమ్ ఆద్మీ పార్టీ చీఫ్, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌పై కేసు నమోదు చేయాలని పంజాబ్ రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఆదేశాలు..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మొహాలి: ఆమ్ ఆద్మీ పార్టీ చీఫ్, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌పై కేసు నమోదు చేయాలని పంజాబ్ రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఆదేశాలు జారీ చేసింది. శిరోమణి అకాలీదళ్ చేసిన ఫిర్యాదు నేపథ్యంలో సాస్ నగర్ సీనియర్ ఎస్‌పీకి చీఫ్ ఎలక్టోరల్ అధికారి ఈ ఆదేశాలిచ్చారు. కేజ్రీవాల్ ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించి ఇతర పార్టీలపై తప్పుడు ఆరోపణలు చేసినందుకు ఈసీ ఈ ఆదేశాలిచ్చింది. ప్రజలకు తప్పుడు సందేశాలు వెళ్లేవిధంగా శిరోమణి అకాలీదళ్, ఇతర పార్టీల ఇమేజ్‌ను దెబ్బతీస్తూ కేజ్రీవాల్ చేసిన వ్యాఖ్యల వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న విషయాన్ని రాష్ట్ర ఎన్నికల కమిషన్ దృష్టికి అకాలీదళ్ తీసుకువెళ్లింది. తగిన చర్యలు తీసుకోవాలని ఈసీని కోరింది.

Updated Date - 2022-02-20T01:11:51+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising