ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కాంగ్రెస్ పార్టీకి గట్టి దెబ్బే: సంజయ్ రౌత్

ABN, First Publish Date - 2022-03-10T20:53:23+05:30

ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఒక్కొక్కటిగా వెలువడుతుండటం, కాంగ్రెస్ పార్టీ నిరాశాజనక ఫలితాలను..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ: ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఒక్కొక్కటిగా వెలువడుతుండటం, కాంగ్రెస్ పార్టీ నిరాశాజనక ఫలితాలను చవిచూస్తుండటంపై శివసేన పార్టీ ఎంపీ సంజయ్ రౌత్ స్పందించారు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘోరమైన ఫలితాలు చవిచూస్తోందన్నారు. అంచనాలకు అనుగుణంగా ఫలితాలు కనిపించడం లేదని చెప్పారు. పంజాబ్‌లో ప్రజలు వేరే ఆప్షన్ ఎంచుకున్నారని, ఆమ్ ఆద్మీ పార్టీని ఎన్నుకున్నారని అన్నారు. బీజేపీ విజయం వెనుక ఆ పార్టీ ఎన్నికల మేనేజిమెంట్ కూడా కారణమని వ్యాఖ్యానించారు. మధ్యాహ్నం 3 గంటల వరకూ వెలువడిన ఫలితాల ప్రకారం, ఉత్తరప్రదేశ్‌, మణిపూర్, ఉత్తరాఖండ్‌లో బీజేపీ అధికారం నిలబెట్టుకోవడం ఖరారు కాగా, పంజాబ్‌లో ఆప్ గెలుపు నిశ్చయమైంది. గోవాలోనూ కాంగ్రెస్ కంటే బీజేపీ ముందంజలో ఉంది.

Updated Date - 2022-03-10T20:53:23+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising