ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఓట్ల కోసం అబద్ధాలు: కాంగ్రెస్‌పై మండిపడ్డ విప్లవ్ దేవ్

ABN, First Publish Date - 2022-02-04T02:58:06+05:30

అబద్ధాలతో మీరు ఎన్నికలకు వెళ్తారు. కానీ ప్రజలు అవినీతి పార్టీలకు ఓట్లు వేయరు. అలా అని ఎన్నికల సంఘాన్ని తప్పు పడ్తారా? అవాస్తవమైన మీ వాదనలను కోర్టులు తప్పు పడితే, న్యాయవ్యవస్థ తప్పా? దుమ్ము మీ ముఖంపై ఉంటే అద్దాన్ని ఎన్నిసార్లు తుడుస్తారు?

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అగర్తలా: ఎన్నికల్లో ఓట్ల కోసం కాంగ్రెస్ పార్టీ అబద్ధాలు ప్రచారం చేస్తోందని త్రిపుర ముఖ్యమంత్రి విప్లవ్ కుమార్ దేవ్ విమర్శలు గుప్పించారు. పార్లమెంట్‌లో ఎన్నికల సంఘంపై న్యాయవ్యవస్థపై రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలపై స్పందిస్తూ ఆయన పై విధంగా అన్నారు. ముఖంపై దుమ్ము ఉంటే అద్ధాన్ని ఎన్నిసార్లు శుభ్రం చేసి ఏం లాభం అంటూ రాహుల్ గాంధీ వీడియో షేర్ చేస్తూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు.


తన అధికారిక ట్విట్టర్ ఖాతాలో రాహుల్ పార్లమెంట్‌లో మాట్లాడిన వీడియో షేర్ చేసిన విప్లవ్ దేవ్ ‘‘అబద్ధాలతో మీరు ఎన్నికలకు వెళ్తారు. కానీ ప్రజలు అవినీతి పార్టీలకు ఓట్లు వేయరు. అలా అని ఎన్నికల సంఘాన్ని తప్పు పడ్తారా? అవాస్తవమైన మీ వాదనలను కోర్టులు తప్పు పడితే, న్యాయవ్యవస్థ తప్పా? దుమ్ము మీ ముఖంపై ఉంటే అద్దాన్ని ఎన్నిసార్లు తుడుస్తారు?’’ అని ట్వీట్ చేశారు.

Updated Date - 2022-02-04T02:58:06+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising