ఈనెల 31 నుంచి బడులు తెరిచి తీరుతాం..! ప్రభుత్వం అనుమతి ఇవ్వకపోయినా..!
ABN, First Publish Date - 2022-01-19T16:28:11+05:30
ప్రభుత్వం అనుమతించినా.. లేకున్నా జనవరి 31 నుంచి పాఠశాలలు రీఓపెన్ చేస్తామని తెలంగాణ రికగ్నైజ్డ్ స్కూల్స్ మేనేజ్మెంట్ అసోసియేషన్..
మే చివరి దాకా విద్యా సంవత్సరాన్ని పొడిగించాలి
తెలంగాణ రికగ్నైజ్డ్ స్కూల్స్ మేనేజ్మెంట్ అసోసియేషన్
ఈ నెల 30 దాకా ఆన్లైన్లో డిగ్రీ క్లాసులు!
హైదరాబాద్ సిటీ, జనవరి 18 (ఆంధ్రజ్యోతి): ప్రభుత్వం అనుమతించినా.. లేకున్నా జనవరి 31 నుంచి పాఠశాలలు రీఓపెన్ చేస్తామని తెలంగాణ రికగ్నైజ్డ్ స్కూల్స్ మేనేజ్మెంట్ అసోసియేషన్(ట్రస్మా) మంగళవారం ప్రకటించింది. తల్లిదండ్రుల నుంచి అంగీకార పత్రం తీసుకుని, కొవిడ్ నిబంధనలు పటిష్టంగా అమలు చేస్తూ తరగతులు నిర్వహిస్తామని పేర్కొంది. హైదరాబాద్, సోమాజిగూడలోని ప్రెస్క్లబ్లో మంగళవారం నిర్వహించిన సమావేశంలో ట్రస్మా రాష్ట్ర అధ్యక్షుడు యాదగిరి శేఖర్రావు విలేకరులతో మాట్లాడారు. తెలంగాణలో కరోనా కేసులు తక్కువగా నమోదవుతున్నా.. విద్యా సంస్థలను మూసివేసిన ప్రభుత్వం పిల్లల భవిష్యత్తో ఆడుకుంటోందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రైవేట్ పాఠశాలల ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా 35 లక్షల మంది బోధన, బోధనేతర సిబ్బంది ఉపాధి పొందుతున్నారని, కరోనా కారణంగా వారంతా ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. ఉపాధి కోల్పోయి పదుల సంఖ్యలో ఉపాధ్యాయులు ఆత్మహత్యలు చేసుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
Updated Date - 2022-01-19T16:28:11+05:30 IST