ఇంగ్లీష్ మీడియం ప్రవేశ పెట్టే ముందే టెట్ నిర్వహించాలి
ABN, First Publish Date - 2022-01-19T21:36:09+05:30
రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో వచ్చే విద్యాసంవత్సరం నుంచి ఇంగ్లీష్ మీడియం ప్రవేశ పేట్టే ముందే మొదటగా ఖాళీగా ఉన్న టీచర్ పోస్టుల భర్తీ కోసం టెట్ నిర్వహించాలని ఎమ్మెల్సీ జీవన్రెడ్డి సీఎం కేసీఆర్ను ప్రశ్నించారు
ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి
జగిత్యాల టౌన్, జనవరి 18 : రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో వచ్చే విద్యాసంవత్సరం నుంచి ఇంగ్లీష్ మీడియం ప్రవేశ పేట్టే ముందే మొదటగా ఖాళీగా ఉన్న టీచర్ పోస్టుల భర్తీ కోసం టెట్ నిర్వహించాలని ఎమ్మెల్సీ జీవన్రెడ్డి సీఎం కేసీఆర్ను ప్రశ్నించారు. జిల్లా కేంద్రంలోని ఇందిరాభవన్లో మంగళవారం ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి విలేకరుల సమావేశం నిర్వహించి మాట్లాడారు. రాష్ట్రం ఏ ర్పడిన అనంతరం మొదటి ఎన్నికల ప్రచారంలో కేజీ టూ పీజీ ఉచిత విధ్య అమలు అనే నినాదంలో అధికారంలోకి వచ్చిన కేసీఆర్ రెండవసారి అధికారంలోకి వచ్చిన తర్వాత విద్యారంగాన్ని పూర్తిగా నిర్వీర్యం చేశారని ఇపుడు మాత్రం ఆంగ్లమాద్యమాన్ని అ మలు చేస్తానని పేర్కొంటూన్నారన్నారు. ఇప్పటికి ఇంకా ఇంగ్లీష్ మీడియం ఏర్పాటుపై అందరికంటే భిన్నంగా ఉన్న వ్యక్తి సీఎం కేసీఆర్ అని పేర్కొన్నారు. ఆంగ్లమాద్యమం ప్రవేశపెట్టే ముందు కేవలం మౌలిక సదుపాయాలు కల్పించినపుడు మాత్రమే విద్యా ర్థులకు న్యాయం జరుగదని, భోధన సదుపాయాల పట్ల దృష్టి పె ట్టాలే తప్ప వారి జీవితాలతో చెలగాటమాడవద్దన్నారు. గడిచిన ఐదేళ్లలో దేశంలో టెట్ నిర్వహిం చని రాష్ట్రంగా తెలంగాణ నిలిం చిందన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో మధ్నాహ్న భోజనం పథకం ఏమైందోనని, వంట కార్మికులు తమ సమస్యలను పరిష్కరిం చా లని సమ్మెకు పోతే ప్రభుత్వం సంబుర పడుతుందన్నారు. తక్షణ మే మధ్యాహ్న భోజన కార్మికుల సమస్యలను ప్రభుత్వం పరిష్క రించాలన్నారు.
Updated Date - 2022-01-19T21:36:09+05:30 IST