సిలబస్ పూర్తి చేయడానికి స్పెషల్ క్లాసులు నిర్వహించండి
ABN, First Publish Date - 2022-02-10T17:08:27+05:30
ఇంటర్మీడియట్ విద్యార్థులకు సకాలంలో సిలబ్సను పూర్తి చేయడానికి ప్రత్యేక క్లాసులను నిర్వహించేలా చర్యలు తీసుకోవాలని జిల్లా విద్యాధికారులను ఆదేశిస్తూ ఇంటర్మీడియట్ బోర్డు ప్రత్యేక సర్క్యూలర్ను జారీ చేసింది. ఏప్రిల్ 20 నుంచి ఇంటర్మీడియట్..
ఇంటర్ బోర్డు
హైదరాబాద్, ఫిబ్రవరి 9 (ఆంధ్రజ్యోతి): ఇంటర్మీడియట్ విద్యార్థులకు సకాలంలో సిలబ్సను పూర్తి చేయడానికి ప్రత్యేక క్లాసులను నిర్వహించేలా చర్యలు తీసుకోవాలని జిల్లా విద్యాధికారులను ఆదేశిస్తూ ఇంటర్మీడియట్ బోర్డు ప్రత్యేక సర్క్యూలర్ను జారీ చేసింది. ఏప్రిల్ 20 నుంచి ఇంటర్మీడియట్ పరీక్షలను నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. అంతకు ముందే ప్రాక్టికల్స్ ఉంటాయి. ఈ నేపథ్యంలో ఇంటర్మీడియట్ సిలబ్సను సకాలంలో పూర్తి చేయాలని బోర్డు స్పష్టం చేసింది.
Updated Date - 2022-02-10T17:08:27+05:30 IST